Biggest Migration : సార్వత్రిక ఎన్నికల సందర్భంగా చరిత్రాత్మక దృశ్యం ఆవిష్కృతం కానుంది. పోలింగ్ కోసం 1.50 కోట్ల మంది సిబ్బందిని, 55 లక్షల ఈవీఎంలను జల, వాయు, రోడ్డు మార్గాల ద్వారా ఈసీ తరలించ నుంది.
దాదాపు 4 లక్షల వాహనాలను ఉపయోగిం చనుం ది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద తరలింపు అని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈసారి ఎన్నిక లకు అవసరమయ్యే 26 లక్షల ఇంక్ బాటిళ్లను కర్ణాటకలోని మైసూరు నుంచి దేశమంతా తర లించనున్నారు.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పెద్ద ఎత్తున ఈ సిబ్బందిని తరలించేటువంటి అవకాశం కనబడుతోంది. ఒక విధంగా చెప్పాలంటే ఒక పండుగ వాతావరణం ఎన్నికల సమయంలో ఏర్పడుతుంది. ఎన్నికల కోసం అధికారులకు ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. శిక్షణ తీసుకున్న అధికారులు పోలింగ్ సిద్ధమవుతున్నారు. అయా రాష్ట్రాల షెడ్యూల్ ప్రకారం ఎన్నికల సిబ్బంది పనిచేయాల్సి ఉంటుంది.