YS Sharmila : ఎన్నికల పరిధిలో నిలిచే అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. కడప పార్ల మెంటు బరిలో వైఎస్ షర్మిల పోటీ చేయనుండగా ఇక్కడే వైసీపీ నుంచి ఎంపీ అవినాష్ రెడ్డి బరిలో ఉన్నారు.
అటు రాజమండ్రి నుంచి గిడుగు రుద్రరాజు, బా పట్ల నుంచి జేడీ శీలం, కాకినాడలో పల్లంరాజు, విశాఖ నుంచి సినీ నిర్మాత సత్య రెడ్డి వారిలో ఉండనున్నారు. ఇక 58 అసెంబ్లీ 8 లోకసభ స్థానాల అభ్యర్థుల ఎంపికను కాంగ్రెస్ పార్టీ పెండింగ్ ఉంచింది.
కడప పార్లమెంట్ స్థానంపైనే ఇప్పుడు సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. ఇక్కడ అవినాష్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో ఉండగా సీఎం చెల్లెలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో ఉండడంతో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.