Road accident : హన్మకొండ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం విషాదాన్ని నింపింది. కరుణాపురం.. రాంపూర్ మధ్య ఉన్న ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో అన్నాచెల్లెళ్లు శుక్రవారం మృతి చెందారు. పూర్తి వివరాల్లోకి వెళితే ఔటర్ రింగు రోడ్డుపై ముందు వెళుతున్న లారీని వెనుక నుంచి పల్సర్ బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో అన్న చెల్లి అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు హసన్ పర్తి మండలం నాగారం గ్రామానికి చెందిన సుమిత్ రెడ్డి.. పూజిత రెడ్డిలుగా పోలీసులు గుర్తించారు. ధర్మసాగర్ పోలీసులు మృతదేహలను ఎంజీఎంలోని మార్చురీకి తరలించారు.
Breaking News