26.9 C
India
Wednesday, December 10, 2025
More

    Cheepurupally : చీపురుపల్లి నియోజకవర్గం టీడీపీలో ట్విస్ట్.. మళ్లీ రంగంలోకి నాగార్జున!

    Date:

    Cheepurupally
    Cheepurupally

    Cheepurupally : ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతు న్నాయి. ముఖ్యంగా టీడీపీ -జనసేన కూటమి తొ లి విడత అభ్యర్థుల జాబితా విడుదల చేసిన నాటి నుంచి పలు నియోజకవర్గాల్లో నిరసనలు మిన్నం టుతున్నాయి. మరోవైపు మిగిలిన నియోజకవ ర్గాల్లో అభ్యర్థుల ఎంపికపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కసరత్తు చేస్తున్నారు.

    ఈ క్రమంలో చీపురుపల్లి నియోజకవర్గం టీడీపీలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. చీపురుపల్లి మండలం కర్లాంలో ఆ పార్టీ ఇంచార్జి కిమిడి నాగార్జున పర్యటించడం చర్చనీయాంశంగా మారింది. చీపురుపల్లి నియోజకవర్గం నుంచి ఈసారి గంటా శ్రీనివాసరావు బరిలోకి దింపేందుకు చంద్రబాబు భావించారు. దీంతో గంటా చీపురపల్లి నుంచి పోటీచేస్తారన్న సమాచారంతో కొన్నిరోజులుగా నాగార్జున అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మళ్లీ తిరిగి నియోజకవర్గంలో నాగార్జున పర్యటించడం చర్చనీయాంశంగా మారింది.

    చీపురపల్లి నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా ప్రస్తుత మంత్రి బొత్స సత్యనారాయణ బరిలో ఉన్నారు. ఈసారి బొత్స సత్యనారాయణకు చెక్ పెట్టాలంటే టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ రావును బరిలోకి దింపాలని చంద్రబాబు భావించారు. ఈ నేపథ్యంలో గత నాలుగురోజుల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబుతో గంటా శ్రీనివాసరావు భేటీ అయ్యారు. ఈ భేటీలో విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని చంద్రబాబు గంటాకు సూచించారు.

    చంద్రబాబుతో భేటీ అనంతరం గంటా మీడియా తో మాట్లాడుతూ.. చీపురుపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని చంద్రబాబు సూచించా రని, తాను భీమిలి నుంచి పోటీకి ఆసక్తి ఉన్నట్లు చెప్పడం జరిగిందని తెలిపారు. ఎక్కడ నిలపాలో తాను నిర్ణయం తీసుకుంటానని, ఆ విషయం తనకు వదిలిపెట్టాలని చంద్రబాబు తనకు చెప్పా రని, చంద్రబాబు సూచన మేరకు తాను నిర్ణయం తీసుకోవటం జరుగుతుందని గంటా చెప్పారు.

    చంద్రబాబుతో గంటా శ్రీనివాసరావు భేటీతో చీపురుపల్లి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగేది గంటానే అని దాదాపు ఖాయమైంది. దీంతో చీపురపల్లి టీడీపీ ఇంఛార్జిగా కొనసాగుతున్న కిమిడి నాగార్జున కొన్నిరోజులుగా నియోజక వర్గా నికి దూరంగా ఉంటూ వస్తున్నారు. నియోజకవ ర్గంలో శ్రీనివాసరావు బరిలో నిలవడం ఖాయం అనుకుంటున్న సమయంలో నాగార్జున తిరిగి నియోజకవర్గంలో పర్యటిచడం చర్చనీయాంశంగా మారింది.

    గంటా చంద్రబాబు ఆదేశాలను తిరస్కరించడంతో నాగార్జున మళ్లీ నియోజకవర్గంలో ప్రచారాన్ని మొ దలు పెట్టి ఉండొచ్చన్న ప్రచారం నియోజకవర్గం రాజకీయాల్లో జరుగుతుంది. అయితే, టీడీపీ శ్రేణు లు గందరగోళానికి గురవుతున్నారు. టీడీపీ నుంచి బరిలో నిలిచే అభ్యర్థిపై అధిష్టానం త్వరగా క్లారిటీ ఇవ్వాలని కోరుతున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Jogi Ramesh : జోగి రమేష్‌పై ఉచ్చు బిగుస్తోందా?

    Jogi Ramesh : మాజీ మంత్రి జోగి రమేష్ రాజకీయ దూకుడే ఇప్పుడు...

    Sajjala Bhargav : సజ్జల భార్గవ్ ఖేల్ ఖతమైనట్టేనా?

    Sajjala Bhargav : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో సజ్జల భార్గవ్ రెడ్డికి...

    AP CM : ఇప్పటికీ ఏపీ సీఎం ‘జగన్’నే.. ఇదే సాక్ష్యం

    AP CM : ఏపీ అధికారంలోకి టీడీపీ కూటమి వచ్చి ఏడాది...

    Nara Lokesh : నారా లోకేశ్‌కు టీడీపీ ఫుల్ పవర్స్..!

    Nara Lokesh : తెలుగు దేశం పార్టీ (టీడీపీ)లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్న...