Two Confirmed IAS In AP : వైసీపీ నేతలు మాట్లాడితే ఒక సామాజిక వర్గంపై విషం చిమ్ముతుంటారు. వాళ్ల పార్టీ మాత్రం మతం చూడదు.. కులం చూడదు అన్నట్లు బిల్డప్ ఇస్తుంటారు. అయితే బయటకు కనిపించేది మాత్రం వారి మాటలకు చేతలకు పొంతనే ఉండదన్నట్లు ఉంటుంది. వైసీపీ అంటేనే కేవలం రెడ్డి సామాజిక వర్గానికి పెద్దపీట వేసే పార్టీలాగా తయారైంది. మంత్రులు, కీలక అధికారులు, నామినేటెడ్ పోస్టులు పెద్ద సంఖ్యలో ఏ సామాజిక వర్గానికి దక్కాయంటే, రెడ్లకే అనే పదం స్పష్టంగా వినిపిస్తుంది.
ఇక తాజాగా ఇద్దరికి ఏపీలో ని వైఎస్ జగన్ రెడ్డి సర్కారు కన్ఫర్డ్ ఐఏఎస్ హోదాలను ఇచ్చింది. వీరిద్దరు కూడా రెడ్లే కావడం ఇక్కడ చర్చనీయాంశమైంది. డాక్టర్ నీలకంఠా రెడ్డి, బొమ్మినేని అనిల్ కుమార్ రెడ్డి కి ఐఏఎస్ లుగా పదోన్నతి కల్పిస్తూ డీవోపీటీ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే వీరిద్దరేం రెవెన్యూలో పనిచేయరు. ఇక వీరిలో ఒకరు సీఎం జగన్ కు రైట్ హ్యాండ్ ధనుంజయ్ రెడ్డికి లెఫ్ట్ హ్యాండ్ కాగా, మరొకరు పులివెందులను మెట్రో సిటీ చేస్తామని బిల్డప్ ఇచ్చి పెట్టిన కార్పొరేషన్ కు అధిపతి. ఇక తమవాళ్లు కాబట్టి కావాల్సింది వడ్డించేశారనే టాక్ వినిపిస్తున్నది.
అయితే గ్రూప్ వన్ ద్వారా వచ్చిన ప్రతి అధికారికి ఐఏఎస్ హోదా దక్కించుకోవాలనే ఆశ ఉంటుంది. రెడ్డి వర్గం ఆఫీసర్లకే ఇలా పెద్ద పీట వేస్తే అసలు సిసలు వారికి మాత్రం అన్యాయం జరుగుతుంటుంది. రాష్ర్టంలో ఓ సామాజికవర్గానికే గతంలో టీడీపీ పెద్ద పీట వేసిందని చెప్పిన వైసీపీ నేతలు, ఇప్పుడు చేస్తున్నది ఏంటో చెప్పాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి. అయిన సామాజిక వర్గాల వారీగా ఇలా రాజకీయం విడిపోవడం ఎంతైనా బాధాకరం. ప్రస్తుతం ఏపీలో అన్ని కీలక పదవుల్లో ఒకే సామాజికవర్గానికి ప్రాధాన్యం కల్పించారని చర్చ జోరుగా సాగుతున్నది.