మాజీ బీఆర్ఎస్ నాయకుడు ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజకీయంపై ఇప్పుడు ఖమ్మంలో ఆసక్తికరమైన చర్ఛ నడుస్తోంది. ఆయన కోసం రెండు జాతీయ పార్టీలు తమ పార్టీలోకి రావాలని పోటీ పడి ఆహ్వనిస్తున్నాయి.
2014 ఎన్నికల వరకు తన బిజినెస్ చేసుకున్న పొంగులేటి 2014 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ పార్టీ నుంచి పోటి చేసి ఖమ్మం ఎంపీగా గెలిచారు. తాను గెలువడమే కాకుండా 4 ఎమ్మెల్యేలను గెలిపించుకున్నారు. తర్వాత కొద్ది రోజులకే టీఆర్ఎస్ వైఎస్సాఆర్ సీపీని విలీనం చేశారు. 2019 ఎన్నికల్లో టీఆర్ఎస్ పొంగులేటిని కాదని నామా నాగేశ్వర్ రావుకు టిక్కెట్ ఇచ్చింది. అప్పటి నుంచి అసంతృప్తితో ఉన్నాడు. అప్పటి నుంచి బీఆర్ఎస్ పై కేసీఆర్ పై విరుచుకుపడుతున్నారు. పొంగులేటి. పార్టీ వ్యతిరేఖంగా పని చేస్తన్నాడని బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసింది బీఆర్ఎస్ అధిష్టానం.. దీంతో ఆగ్రహానికి గురైన పొంగులేటి ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి బీఆర్ఎస్ నుంచి ఒక్క ఎమ్మెల్యేను కూడా అసెంబ్లీ గేటు తాకనివ్వనని శపథం చేశారు.
పొంగులేటి చరిష్మా వాడుకోవాలని అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ పార్టీలు పోటీ పడుతున్నాయి. ఇప్పటీకే రాహుల్ గాంధీ పంపిన టీం పొంగులేటిని కలిసి పార్టీలోకి రావాలని కోరింది. నిన్న బీజేపీ చేరికల కమిటీ ఛైర్మన్ గా ఉన్న ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు ఆయన నివాసానికి వెళ్లి పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. మనం ఇద్దరం పోరాడేది కేసీఆర్ పైనే నని మీరు పార్టీలోకి వస్తే అమిత్ షా, నడ్డాలతో చెప్పి సముచిత స్థానం కల్పిస్తామని, మీరు చెప్పిన వారికి టిక్కెట్లు ఇప్పిస్తామని హమీ ఇచ్చారట… అయితే పొంగులేటి పార్టీ కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని చెప్పారని సమాచారం.
పొంగులేటికి మంచి పట్టు ఉంది. తమ పార్టీలోకి వస్తే 5నుంచి 10 సీట్లు గెలిపించుకునే సత్తా పొంగులేటికి ఉందని ఇరు పార్టీలు బావిస్తున్నాయి. కాని పొంగులేటి నుంచి ఏలాంటి ప్రకటన రాలేదు. బీజేపీ వైపు అడుగులు వేస్తారా.. కాంగ్రెస్ వైపు పడతాయ.. అని ఖమ్మంలో ఆసక్తికర చర్చ నడుస్తుంది.