గతంలో దాడుల నేపథ్యంలో ప్రధానులు పాక్ ను దోషి అని చూపడంలో విఫలమయ్యారు. ఉగ్రవాదులను పాక్ ప్రభుత్వమే పెంచి పోషిస్తుందని ఇతర దేశాలు విశ్వసించేలా చెప్పడంలో కూడా విఫలమయ్యారు. కానీ మోడీ ప్రభుత్వం దౌత్య విధానంతో శుత్రుదేశం పాకిస్థాన్ ను ప్రపంచం నుంచి ఒంటరిని చేయడంలో సక్సెస్ అయ్యింది. దీంతో ప్రపంచంలోని చాలా దేశాలు ఆ దేశానికి నిధులు ఇవ్వడం ఆపివేశాయి. దీంతో వారి జీవనంసాగడమే కష్టతరంగా మారింది. ఇక ఉగ్రవాదులకు సాయం చేయాలన్న ఆలోచన కూడా వారిలో కలగలేదు.
కొవిడ్ కూడా ఒక విధంగా ఉగ్రవాదాన్ని అనిచివేసిందని చెప్పవచ్చు. కొవిడ్ సమయంలో ఒక దేశం మరో దేశంతో కమ్యునికేషన్ లేదు. వ్యాపారం, వాణిజ్యం పూర్తిగా నిలిచిపోయింది. ఏ దేశమైనా ఉన్నంతలో సర్ధుకోవాల్సి వచ్చింది. ఇక పాకిస్థాన్ పరిస్థితి మరింత దయానీయంగా మారింది. దీంతో వారు ఉగ్రవాదులకు నిధులు ఇవ్వడం ఆపివేశారు. ఇది కూడా కొంత మేలు చేసిందనే చెప్పవచ్చు. అయితే ఇటీవల సోషల్ మీడియాలో ఆసక్తికర విషయం చెక్కర్లు కొడుతోంది.
యూపీఏ పదేళ్లు పాలన, 9 ఏళ్ల ఎన్డీయే పాలనలో వివిధ నగరాల్లో జరిగిన వివిధ ఉగ్రవాద దాడుల్లో మరణించిన వారి సంఖ్య ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముంబైలో యూపీఏ సమయంలో 406 మంది చనిపోగా మోడీ హయాంలో ‘0’గా ఉంది. ఢిల్లీ 122, 0, గుహవాటి 81, 0, హైదరాబాద్ 71, 0, జైపూర్ 63, 0, వారనాసి 32, 0, గుజరాత్ 29, 0 గా ఉంది. ప్రస్తుతం ఇది నెట్ లో తెగ వైరల్ అవుతుంది.