33.3 C
India
Thursday, May 16, 2024
More

    ‘వందేభారత్’ సరికొత్త అప్డేట్

    Date:

    • బోగీలను పెంచుతూ నిర్ణయం తీసుకున్న రైల్వే శాఖ
    • ట్వీట్ చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
    Vandebharat kishan reddy
    kishan reddy

    Vandebharat Latest Update :ఇది తెలుగు రాష్ర్టాల ప్రజలకు గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. సికింద్రాబాద్ తిరుపతి మధ్య నడుస్తున్న వందే భారత్ రైలుకు సంబంధించిన అప్డేట్ ఇది. ఇటీవల ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించబడిన ఈ ట్రైన్ కు అనూహ్య స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో బోగీలను పెంచుతూ తాజాగా నిర్ణయం తీసుకున్నది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వయంగా ట్విట్టర్లో ప్రకటించారు. ప్రయాణికుల రద్దీ, రైలుకు వస్తున్న ఆదరణ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు.

    తిరుపతి రద్దీ నేపథ్యంలో..

    వేసవి సెలవుల్లో తిరుపతికి భారీ సంఖ్యలో భక్తులు వెళ్తారు. తెలంగాణ నుంచి ముఖ్యంగా ఈ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. వందేభారత్ ట్రైన్ మొదలయ్యాక ఈ రైలుకు వస్తున్న ఆదరణ భారీ స్థాయిలో ఉంది. చాలా మంది టికెట్లు దొరక్క ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటున్నారు. 120 పైచిలుకు అక్యునెన్సీ నమోదవుతున్నట్లు రైల్వై శాఖ గుర్తించింది కూడా. ఈ మేరకు ప్రజల నుంచి వస్తున్న డిమాండ్ ను దృష్టిలో పెట్టుకొని, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వయంగా చొరవ తీసుకున్నారు. సౌత్ సెంట్రల్ రైల్వే జీఎంతో స్వయంగా మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే రైల్వే అధికారులు సమావేశమై, తాజాగా సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్ ట్రైన్ బోగీలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే ఈ బోగీలు అందుబాటులోకి రానున్నట్లుగా సమాచారం. సికింద్రాబాద్ నుంచి ప్రయాణించే వారికి ఇది మరింత సౌలభ్యం కానుంది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రధానితో పాటు రైల్వే మంత్రికి ధన్యవాదాలు తెలిపారు.

    Share post:

    More like this
    Related

    Bengali Girl Viral : ఐపీఎల్ కు హీట్ పెంచుతున్న బెంగాలీ.. అసలు ఎవరీమే?

    Bengali Girl Viral :  ఐపీఎల్ టోర్నమెంట్ ప్రారంభమైదంటే చాలు క్రికెట్...

    Sr. NTR : ఎన్టీఆర్ చరితం చిరస్మరణీయం..

    Sr. NTR : ఎన్టీఆర్ తెలుగు ఆత్మగౌరవాన్ని దేశవ్యాప్తంగా చాటిన మహనీయుడు....

    Indian 2 : ‘భారతీయుడు2’ రిలీజ్ డేట్ ఫిక్స్?

    Indian 2 : విశ్వనటుడు కమల్ హాసన్, ప్రముఖ దర్శకుడు శంకర్...

    Palnadu News : బస్సులో మంటలు.. ఆరుగురి సజీవ దహనం..

    Palnadu News : పల్నాడులో బుధవారం తెల్లవారు జామున ఓ ప్రైవేటు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Madhavi Latha : ఓట్ల తొలగింపుపై న్యాయ పోరాటం చేస్తా: బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత

    Madhavi Latha : హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గం లో చాలా...

    Modi Nomination : ‘గంగా’ ఆశీస్సులతో మోడీ నామినేషన్.. భారీ ర్యాలీ..

    Modi Nomination : ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి నియోజకవర్గంలో మంగళవారం (మే...

    Kishan Reddy : రెండంకెల ఎంపీ స్థానాలు గెలుస్తాం: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

    Kishan Reddy : రెండంకెల ఎంపీ స్థానాలు గెలిచి తెలంగాణలో బీజేపీ...

    KCR : కేంద్రంలో వచ్చేది ఆ ప్రభుత్వమే..: కేసీఆర్

    KCR : కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందో బీఆర్ఎస్...