- బోగీలను పెంచుతూ నిర్ణయం తీసుకున్న రైల్వే శాఖ
- ట్వీట్ చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
Vandebharat Latest Update :ఇది తెలుగు రాష్ర్టాల ప్రజలకు గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. సికింద్రాబాద్ తిరుపతి మధ్య నడుస్తున్న వందే భారత్ రైలుకు సంబంధించిన అప్డేట్ ఇది. ఇటీవల ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించబడిన ఈ ట్రైన్ కు అనూహ్య స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో బోగీలను పెంచుతూ తాజాగా నిర్ణయం తీసుకున్నది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వయంగా ట్విట్టర్లో ప్రకటించారు. ప్రయాణికుల రద్దీ, రైలుకు వస్తున్న ఆదరణ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు.
తిరుపతి రద్దీ నేపథ్యంలో..
వేసవి సెలవుల్లో తిరుపతికి భారీ సంఖ్యలో భక్తులు వెళ్తారు. తెలంగాణ నుంచి ముఖ్యంగా ఈ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. వందేభారత్ ట్రైన్ మొదలయ్యాక ఈ రైలుకు వస్తున్న ఆదరణ భారీ స్థాయిలో ఉంది. చాలా మంది టికెట్లు దొరక్క ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటున్నారు. 120 పైచిలుకు అక్యునెన్సీ నమోదవుతున్నట్లు రైల్వై శాఖ గుర్తించింది కూడా. ఈ మేరకు ప్రజల నుంచి వస్తున్న డిమాండ్ ను దృష్టిలో పెట్టుకొని, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వయంగా చొరవ తీసుకున్నారు. సౌత్ సెంట్రల్ రైల్వే జీఎంతో స్వయంగా మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే రైల్వే అధికారులు సమావేశమై, తాజాగా సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్ ట్రైన్ బోగీలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే ఈ బోగీలు అందుబాటులోకి రానున్నట్లుగా సమాచారం. సికింద్రాబాద్ నుంచి ప్రయాణించే వారికి ఇది మరింత సౌలభ్యం కానుంది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రధానితో పాటు రైల్వే మంత్రికి ధన్యవాదాలు తెలిపారు.