ప్రస్తుతం చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య ఆస్తమా. వర్షాకాలం ఆరంభంలో చాలా మంది చేపలు తింటుంటారు. ఆస్తమా ఉన్న వారికి డ్రై ఫ్రూట్స్ మంచి ఆహారం. ఇందులో విటమిన్లు, ప్రొటీన్లు ఉండటం వల్ల ఎన్నో లాభాలుంటాయి. బాదం, పిస్తా, వాల్ నట్స్, ఖర్జూరాలు వంటివి తీసుకోవడం వల్ల మనకు ఎన్నో పోషకాలు అందుతాయి. ఈ నేపథ్యంలో వీటిని తినడం వల్ల మనకు ప్రయోజనాలు మెండుగా ఉన్నాయి. ప్రపంచ ఆస్తమా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.
ఆస్తమా ఉన్న వారికి చేపలు మంచి ఆహారం. ఇందులో ఒమేగా 3 ఫ్యాట్ ఉండటం వల్ల వీరికి మంచిది. సాల్మన్, హెర్రింగ్, ట్యూనా, సార్డినెస్ వంటి చేపలు తినడం వల్ల లాభం ఉంటుంది. ఇంకా వీరు టమాటాలు ఎక్కువగా తినాలి. ఇందులో లైకోపీన్ ఎక్కువగా ఉండటం వల్ల ఆస్తమా రోగులకు ఇది మంచి ఫలితాలు ఇస్తుంది. కూరల్లో ఎక్కువడా వాడుకుంటే ఆస్తమాకు చెక్ పెట్టొచ్చు.
విటమిన్లు ఉన్న ఆహారాలు తీసుకోవాలి. ఇందులో చేపలు, పాలు, గుడ్లు, నారింజ రసం తీసుకోవచ్చు. దీంతో మన శారీరక శక్తి పెరుగుతుంది. రోగ నిరోధక శక్తి ఇనుమడిస్తుంది. ఈ ఆహారాల్లో విటమిన్ డి తక్కువగా ఉండటంతో వీటిని తీసుకోవడం ఎంతో మంచిది. వీటి వల్ల మనకు ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ ఆహారాలు తీసుకునేందుకు మొగ్గు చూపడం వల్ల ప్రయోజనాలు పెరుగుతాయి.
ఆస్తమా ఉంటే సమస్యలు వస్తాయి. వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. మంచి ఆహారాలు తీసుకుని ఆరోగ్యాన్ని అదుపులో ఉంచుకోవాలి. అప్పుడే మనకు ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి. ఈనేపథ్యంలో ఆస్తమా రోగులు జాగ్రత్తగా ఉండాలి. శ్వాస సమస్యలు వస్తే వెంటనే డాక్టర్ ను సంప్రదించి చికిత్స తీసుకోవాలి.