Chandrababu : వర్తమాన రాజకీయాలలో ఏ కేసులైనా అధికార పార్టీకి జమ్మి చెట్టు మీద పాండవులు దాచి పెట్టిన అస్త్ర శాస్త్రాల వంటివే. అవసరమైనప్పుడు వాటిని కిందకుదించి ప్రత్యర్ధుల పై ప్రయోగిస్తుండటం మనమందరం చూస్తుంటాం..
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుని స్కిల్ డెవలప్ మెంట్ కేసులో జగన్ ప్రభుత్వం అరెస్ట్ చేసినప్పుడు ప్రతీరోజూ వార్తల్లో సుప్రీంకోర్టులో ఆయన వేసిన క్వాష్ పిటిషన్ గురించే మీడియా లో వార్తలు వస్తుండేవి. ముఖ్యంగా ఆ కేసులో సెక్షన్ 17ఏపై సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. చివరికి ఆ కేసులో చంద్రబాబు నాయు డు వేసిన క్వాష్ పిటిషన్పై తీర్పుని రిజర్వ్ చేస్తున్నట్లు అక్టోబర్ 17న సుప్రీంకోర్టు ప్రకటించిన విషయం తెలిసిందే..
వారం పదిరోజులలోగా తీర్పు వెల్లడిస్తుందని అందరూ భావించగా రెండు నెలలైనప్పటికీ ఇంత వరకు తీర్పు వెల్లడించలేదు. కానీ బెయిల్పై ఉన్న చంద్రబాబు నాయుడు రాజకీయ సభలు, సమావే శాలలో పాల్గొనేందుకు సుప్రీంకోర్టు అనుమతించ డంతో, ఆయన రాజకీయాలలో మళ్ళీ యాక్టివ్ అయ్యారని చెప్పుకోవచ్చు..
సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ సంగతి దాదాపు అందరూ మరిచిపోయారనే చెప్పవచ్చు. చంద్రబా బు నాయుడు తరపు న్యాయవా దులు కూడా సుప్రీం కోర్టు రిజర్వ్ చేసిన తీర్పు గురించి తొందరప డకపోవడం గమనిస్తే, తీర్పు ఆయనకు సానుకూ లంగా ఉంటుందనే నమ్మకంతోనే వారు ఉన్నట్లు తెలుస్తోంది.
త్వరలో జరుగబోయే శాసనసభ, లోక్సభ ఎన్నిక లకు ముందే సుప్రీం కోర్టులోని ఈ కేసుతో సహా అన్ని కేసుల నుంచి చంద్రబాబు నాయుడుకి విముక్తి లభిస్తే వ్యక్తిగ తంగా ఆయనకు, రాజకీ యంగా టిడిపికి కూడా చాలా మంచిదని అందరూ భావిస్తున్నారు.