Chandrababu : వైసీపీ చేస్తున్న కుట్రలు, కుతంత్రాల్లో అధికారులు కూడా భాగస్వాములు అవుతున్నారని ఇది దురదృష్టకర పరిణామమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. పిఛన్లను ఇంటింటికీ వెళ్లి ఇవ్వకుండా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామనడం సమంజసం కాదన్నార. మండుటెండల్లో వృద్ధులను బ్యాంకుల చుట్టూ తిప్పడం సబబా అని ప్రశ్నించారు. ఈరోజు కర్నూలు జిల్లా గూడూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు.
ప్రభుత్వ సిబ్బంది ఉన్నా ఇంటింటికీ పింఛను ఎందుకు ఇవ్వలేకపోతున్నారని అన్నారు. ఎన్నికల అధికారులు చెప్పినా రాష్ట్ర అధికారులు వినే పరిస్థితి లేకుండా పోయిందని.. కుంటి సాకులతో తపకపించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఒక పార్టీ, ఒక వ్యక్తి ప్రయోజనాల కోసం అధికారులు పనిచేయడం ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమని పేర్కొన్నారు. పింఛనుదారులకు ఏ ప్రమాదం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యతని హెచ్చరించారు. తప్పుడు రాజకీయాలు చేసి నాటకాలు ఆడవద్దని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.