VOTE : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఓటు హక్కు దరఖాస్తు చేసుకునేలా అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. రాష్ట్రంలోని జిల్లాల కలెక్టర్లు కూడా తహశీల్దార్, బీఎల్ఓలు, రాజకీయ నాయకులతో విస్తృతంగా సమావేశాలు నిర్వహిస్తూ ఓటు హక్కు నమోదు చేసుకోవడంతో పాటు మరణించిన, ఇల్లు వదిలి వెళ్లిపోయిన వారి వివరాలను జాబితా నుంచి తొలగించాలని సూచిస్తున్నారు.
ఇక బీఎల్ఓలు ఇంటింటికీ తిరుగుతూ 18 సంవత్సరాలు దాటిన వారు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునేలా చూస్తున్నారు. సంబంధించిన ఫామ్స్ అందజేస్తూ దగ్గరుండి దరఖాస్తు చేయిస్తున్నారు. మరికొంత మంది మీ సేవా సెంటర్లకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో మీ సేవా సెంటర్ల వద్ద కొత్త ఓటరు నమోదు అర్జీదారుల తాకిడి ఎక్కువైంది. మిగతా సేవలకు ఇబ్బందులు కలుగుతుండడంతో మీ సేవా సెంటర్లకు వెళ్లకుండానే ఓటు హక్కు పొందవచ్చని సూచిస్తున్నారు. సంబంధిత వివరాలను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీడియాకు వివరించింది.
ఓటు హక్కు కోసం మీ సేవా సెంటర్లకు, ఇంటర్ నెట్ సెంటర్లకు వెళ్లకుండా ఇంట్లోనే దరఖాస్తు చేసుకోవచ్చని సూచిస్తుంది. దీని కోసం ప్రత్యేకంగా ఒక యాప్ ను తీసుకువచ్చింది. దీని ద్వారా ఇంట్లోనే కేవలం 2 నిమిషాల్లోనే దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. దీనికి సంబంధించిన వీడియోను GHMC ఎల్బీనగర్ డీసీ ట్విటర్ లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా ఈ వీడియో అందుబాటులో ఉంది. దీని ద్వారా ప్రతీ ఓటరు ఓటు హక్కు కోసం నమోదు చేసుకోవానలి అధికారులు సూచిస్తున్నారు.