Qatar vs India : గూఢచర్యం ఆరోపణల పై గత కొద్ది రోజుల నుండి దోహలోని ఖాతర్ జైలులో నిర్భంధం లో ఉన్న 8 మంది భారతీయుల మరణ శిక్ష కేసు నేడు విచారణకు వచ్చింది. అప్పీల్ ని పరిశీలిస్తున్నాం అని, త్వరలోనే దీనిపై తుది తీర్పు ఇస్తామని ఖాతర్ కోర్టు నేడు ప్రకటించింది. గత ఏడాది ప్రైవేట్ భద్రతా సంస్థ ఆల్ దాహ్రలో లో పనిచేస్తున్న 8 మంది భారత నౌకదళ మాజీ అధికారులను అనుమానితులుగా భావించి అరెస్ట్ చేసారు. ఇజ్రాయల్ దేశానికీ గూడచర్యం చేస్తున్నట్టు అభియోగాలు వేశారు. దీనిపై తీవ్రమైన నిరసన వ్యక్తం చేసిన భారత ప్రభుత్వం అదుపులో ఉన్న 8 మంది భారతీయులను నిర్దోషులుగా నిరూపించి బయటకి తీసుకొచ్చేందుకు కావాల్సిన ప్రక్రియ ని మొదలుపెట్టి ఖతార్ కోర్టులో పిటిషన్ వేసింది. ఆ పిటీషన్ ని విచారిస్తాము అంటూ నేడు కోర్టు ప్రకటించడం తో భారత ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసింది.
Breaking News