23.3 C
India
Thursday, January 15, 2026
More

    Ap BJP: ఏపీ బీజేపీ ఇన్‌చార్జిగా బండి – ఇక నేతలకు బ్రేక్ పడ్డట్లే..!?

    Date:

    Ap BJP: భారతీయ జనతా పార్టీ తెలంగాణలో మార్పుల అనంతరం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పై పడింది. తెలంగాణలో పార్టీ అధ్యక్ష పగ్గాలను బండి నుంచి కిషన్ రెడ్డికి ఇచ్చిన హై కమాండ్. ఏపీలో కూడా సోము నుంచి పురందేశ్వరికి అప్పగించింది. కానీ ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. అదేంటంటే.. పార్టీ ఏపీ ఇన్‌చార్జిగా బండి సంజయ్ ను నియమించాలని చూస్తోంది.

    బీజేపీ రాజకీయం ఒక పట్టాన అంతుచిక్కదు. ఇప్పటి వరకు జనసేనతో మాత్రమే పొత్తు పెట్టుకున్న బీజేపీ. టీడీపీతో కూడా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. కానీ దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి లీకులు ఇవ్వడం లేదు. గతంలో పుణేలో జరిగిన ఎన్డీఏ సమావేశానికి పవన్ ను ఆహ్వానించిన బీజేపీ, టీడీపీని పిలవలేదు.

    తెలుగు రాష్ట్రాల్లో కొత్త రాజకీయం మొదలుపెట్టింది. 2 తెలుగు రాష్ట్రాల్లో అధ్యక్షులను మార్చింది. బండికి ప్రమోషన్ ఇచ్చిన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. దీంతో పాటు మరో కీలక బాధ్యత అప్పగించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఏపీ ఇన్ చార్జి బాధ్యతలు కూడా ఆయన భూజాలపైనే వేయాలని చూస్తోంది.

    కీలకమైన సమయాల్లో కేంద్రంలోని బీజేపీ వైసీపీ మద్దతు తీసుకుంటుంది. కానీ, ఏపీలో మాత్రం జనసేనతో కలిసి ప్రయాణం చేస్తోంది. టీడీపీతో వైఖరిపై ఎటువంటి స్పష్టత ఇవ్వడం లేదు. కేంద్ర మంత్రి మురళీధరన్ 2018 నుంచి ఏపీ బీజేపీ ఇన్‌ చార్జిగా వ్యవహరిస్తున్నారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా విధులు నిర్వర్తిస్తూనే ఇన్ చార్జిగా వ్యవహరిస్తున్నడు. కానీ మూడు, నాలుగు నెలలకు ఒకసారి కూడా ఏపీకి రావడం లేదు. దీంతో ఈ బాధ్యతలు తనకు తలకు మించుతున్నాయని, తప్పించాలని పార్టీ హైకమాండ్ ను మురళీధరన్ కోరుతున్నట్లు తెలుస్తోంది. బీజేపీలో గత ఎన్నికల తరువాత చేరిన కొందరు నేతల తీరు.. పార్టీ రాష్ట్ర శాఖలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో మురళీధరన్ తప్పుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

    రాష్ట్రాల్లో ఇన్ చార్జిలు, సహ ఇన్‌ చార్జిలను మార్చేందుకు అధిష్టానం‌ కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో మురళీధరన్‌ కూడా ఈ బాధ్యతల నుంచి తనను తప్పించాలని కోరుతుండగా కొత్త ఇన్ చార్జి నియమాకంపై పార్టీలో తీవ్రంగా కసరత్తు జరుగుతోంది. అందులో బండి సంజయ్ ని నియమించే అవకాశాలున్నట్లు బీజేపీ ముఖ్య నేతలు అంచనా వేస్తున్నారు.

    బండి సంజయ్ తెలంగాణ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే మంచి మైలేజ్ వచ్చింది. కేడర్ బలోపేతం కావడంతో పాటు కార్యకర్తలు పెరిగారు. దీనికి తోడు ఆయన పాదయాత్రతో పార్టీ గ్రామ స్థాయి వరకు వెళ్లగలిగింది. ఇదే తరహాలో ఏపీలో కూడా వ్యవహరిస్తే పార్టీకి మంచి మైలేజ్ వచ్చే అవకాశం ఉందని, రెండు రాష్ట్రాలకు ఎన్నికలు సమీపిస్తుండడంతో ఏపీతో పాటు ఇటు తెలంగాణలో కూడా కలిసి వస్తుందని భావిస్తున్నారు. దీనిపై రెండు రోజుల్లో నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    BJP : బీజేపీ వైపు రేవంత్ రెడ్డి చూస్తున్నారా?

    ఇంటర్వ్యూలో నిజాలు బయటపెట్టిన ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి తెలంగాణ రాజకీయాల్లో...

    Delhi elections : ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పై NRI లు ఏమన్నారంటే..

    Delhi elections : విభిన్న రాష్ట్రాల్లో వ్యూహపరమైన పొరపాట్లు, ప్రత్యర్థి పార్టీలతో అనవసరంగా...

    BJP : బీజేపీలోకి విజయసాయి కుమార్తె..!

    AP BJP : తెలుగు రాష్ట్ర రాజకీయాలలో విజయసాయి రెడ్డి వేస్తున్న అడుగులు.....

    Delhi elections : ఢిల్లీ ఎన్నికలు : ఐదు గ్యారెంటీలతో కాంగ్రెస్ మేనిఫెస్టో!

    Delhi elections : మరో వారం రోజుల్లో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి....