అమెరికా వీసాల కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న భారతీయులకు ఎట్టకేలకు శుభవార్త చెప్పనుందట. అమెరికా తీసుకునే చర్యల వల్ల ఇకపై ఏడాదికి 12 లక్షల వీసాలు మంజూరు కావడం ఖాయమని అంటున్నారు భారత్ లోని అమెరికా దౌత్య కార్యాలయ సిబ్బంది.
కరోనా కారణంగా అమెరికా పలు దేశాల పౌరులకు వీసాలను కఠినతరం చేసింది. కరోనా కాస్త అదుపులోకి వచ్చినప్పటికీ ……. ఆ నిర్ణయాలలో ఎలాంటి మార్పులు చేయలేదు. భారతీయులకు వీసాలను మంజూరు చేయడంలో అలాగే వీసాలను రెన్యూవల్ చేయడంలో కఠినంగా వ్యవహరించింది అమెరికా. అదే సమయంలో చైనా వాళ్లకు మాత్రం పెద్ద ఎత్తున వీసాలను మంజూరు చేస్తూనే ఉంది.
ఈ వివక్ష పట్ల భారత ప్రభుత్వం తమ అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఎట్టకేలకు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. దాంతో త్వరలోనే భారతీయులకు వీసాల విషయంలో శుభవార్త చెప్పడం ఖాయమని అంటున్నారు. ఇక పై ఏడాదికి 12 లక్షల వీసాలను మంజూరు చేయడం అంటే తప్పకుండా అమెరికా వెళ్లాలని తపించే భారతీయుల కష్టాలు కాస్త తీరినట్లే.