MLC Santhosh మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్ బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. పార్టీలో ఇమడలేక టాటా చెప్పేశారు. ఇక మీదట బీఆర్ఎస్ కు షాక్ తగిలినట్లు అయింది. ఇన్నాళ్లుగా వస్తున్న ఊహాగానాలకు తెర వేస్తూ సంతోష్ కుమార్ పార్టీకి గుడ్ బై చెప్పారు. చాలా రోజులుగా వస్తున్న ప్రశ్నలకు జవాబు చెప్పినట్లు సంతోష్ కుమార్ తన దారి తాను చూసుకున్నారు. పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు.
కరీంనగర్ లో మాజీ మంత్రి గంగుల కమలాకర్ తో పడలేకే సంతోష్ పార్టీని వీడినట్లు తెలుస్తోంది. తన సొంత గూడైన కాంగ్రెస్ పార్టీలో చేరారు. గంగుల ఏకచత్రాధిపత్యాన్ని సంతోష్ ప్రశ్నించారు. తన మనుగడకు విలువ ఇవ్వడం లేదని అక్కసుతోనే పార్టీని విడిచి వెళ్లినట్లు సమాచారం. ఈనేపథ్యంలో సంతోష్ కుమార్ పార్టీని వీడటం పెద్ద లోటే అని రాజకీయ విమర్శకులు చెబుతున్నారు.
కరీంనగర్ పార్లమెంట్ స్థానంపై సంతోష్ గురి పెట్టినట్లు తెలుస్తోంది. ఇక్కడ నుంచి పోటీ చేసి విజయం సాధించాలనే ఉద్దేశంలో ఉన్నట్లు పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. బీజేపీలో చేరాలని ఆశించినా మైనార్టీ ఓట్లు అధికంగా ఉండటంతో కాంగ్రెస్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో సంతోష్ కుమార్ కు ఎంపీ టికెట్ వస్తుందనే ఆశలో ఉన్నట్లు చెబుతున్నారు.
సంతోష్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఎంపీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీఆర్ఎస్ టికెట్ వినోద్ కుమార్ కు ఖాయమనే తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు ఎవరికి టికెట్ అనేది ప్రకటించలేదు. కానీ సంతోష్ కుమార్ ను తీసుకొచ్చి టికెట్ ఇచ్చి పోటీలో ఉంచుతుందనే అంటున్నారు. ఇక రాబోయే ఎన్నికల్లో త్రిముఖ పోరు ఖాయమని తెలిసిపోతోంది.