ఈరోజు మళ్ళీ సిట్ విచారణకు డుమ్మా కొట్టాడు బండి సంజయ్. ఈరోజు సిట్ ముందు విచారణకు హాజరు కావాలని , అలాగే మీ దగ్గర ఉన్న ఆధారాలు మాకు సమర్పించాలని కోరుతూ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే అంతకుముందు కూడా బండి సంజయ్ కి నోటీసులు ఇచ్చింది సిట్. కానీ అప్పుడు కూడా విచారణకు వెళ్లకుండా డుమ్మా కొట్టాడు. కట్ చేస్తే ఈరోజు కూడా సిట్ విచారణకు బండి సంజయ్ వెళ్లకుండా బెంగుళూర్ వెళ్ళాడు.
తనకు బదులుగా తన లీగల్ టీమ్ ను సిట్ విచారణకు పంపిస్తున్నాడు. దాంతో సిట్ అధికారులకు ఓ లేఖ రాసాడు. ఆ లేఖలో తనకున్న అనుమానాలను కూడా వ్యక్తం చేసాడు. తనకు పార్లమెంట్ సమావేశాలతో పాటుగా ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలు ఉన్నందున ఈ విచారణకు వ్యక్తిగతంగా హాజరు కాలేక పోతున్నానని స్పష్టం చేసాడు. మరి ఈ లేఖ పై సిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.