A boy was killed his girlfriend : వివాహేతర సంబంధాలు కుటుంబాల్లో కల్లోలం రేపుతున్నాయి. తొందరపాటులో ఒకరి హత్య, మరొకరి జైలు జీవితం ఇద్దరూ ఇందులో ఎఫెక్ట్ అవుతున్నారు. తాజాగా హైదరాబాద్ లో ఒక దారుణం వెలుగు చూసింది. వివాహేతర సంబంధంలో ఉన్న యువతి తనను పెళ్లి చేసుకోమన్నందుకు ఆమెను చంపాడు ప్రియుడు. పైగా సదరు యువతి కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో హత్య తతంగం వెలుగు చూసింది.
హైదరాబాద్ లోని సరూర్ నగర్ కు చెందిన పూజారి వెంకటసాయి కృష్ణ. అప్సర అనే యువతితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి కారణమైంది. తనను పెళ్లి చేసుకోవాలని అప్సర వెంకటసాయి కృష్ణపై ఒత్తిడి తెస్తుంది. ఈ మధ్య ఇది మరీ ఎక్కువైంది. అయితే తనకు పెళ్లి జరిగిందని, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని వెంకట సాయి కృష్ణ మొదటి నుంచి చెప్తూనే ఉన్నాడు. అయనా పర్వాలేదు అంటూనే అప్సర మరింత ఒత్తిడి పెంచింది. ఇక లాభం లేదని, తనను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని పట్టు బట్టింది. దీంతో ఆమెను అడ్డు తొలగించుకోవాలని వెంకట సాయి కృష్ణ నిర్ణయించుకున్నాడు.
హత్యకు పథకం వేశాడు. ఎలాగో ఒకలా అప్సరను నమ్మించి 3వ తేదీన కారులో సుల్తాన్పల్లికి తీసుకెళ్లాడు. ఆమె తలపై బండరాయితో మోది దారుణంగా హత్య చేశాడు. ఆ తరువాత మృత దేహాన్ని సంచిలో వేసి కుట్టేసి, స్థానికంగా ఉన్న మ్యాన్ హోల్ లో పడేశాడు. ఆపై ఏమీ తెలియనట్టు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీ ఫుటేజీ ఆధారంగా వెంకటసాయి అప్సరను చంపాడని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. పోలీసులను తమదైన స్టయిల్ లో విచారణ చేపట్టగా, నేరం ఒప్పుకున్నాడు వెంకటసాయి. అప్సర మృతదేహాన్ని ఏ మ్యాన్ హోల్ లో వేశాడో కూడా చూపించాడు.
ప్రస్తుతం అప్సర మృతదేహం కోసం అధికారులు శ్రమిస్తున్నారు. ఈ విషయంపై ఆమె తల్లితో మాట్లాడగా తన కూతురు కనిపించకపోవడంతో వెంకటసాయి కృష్ణను అడిగానని ఆమె కోయంబత్తూర్ కు వెళ్లిందని చెప్పాడని వివరించింది. ఈ మర్డర్ తో వెంకటసాయి కృష్ణకు ఎలాంటి సంబంధం లేదని ఆయన కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మరి ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.