34.7 C
India
Friday, May 17, 2024
More

    Tirupati: తిరుమలలో భక్తుల ప్రాణాలకు రక్షణేది..?

    Date:

    Tirupati
    Tirupati

    Tirupati:

    తిరుమలలో భక్తుల ప్రాణాలకు రక్షణ కొరవడినట్లు కనిపిస్తున్నది. తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు దేశ, విదేశాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. దేవదేవుడి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు కొండపైకి చేరుకుంటారు. కొందరు వాహనాల్లో, మరికొందరు కాలినడకన మెట్ల మార్గంలో వస్తుంటారు. అయితే కొంత కాలంగా ఈ మెట్ల మార్గంలో వచ్చే భక్తుల భద్రతను ఏపీ ప్రభుత్వం, టీటీడీ గాలికొదిలేసినట్లు విమర్శలు వస్తున్నాయి. కనీసం రక్షణ చర్యలు కానరావడం లేదని భక్తులు మండిపడుతున్నారు. మౌళిక వసతుల కల్పనలోనూ ప్రస్తుత జగన్ సర్కారు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నది. తెలుగు రాష్ర్టాల భక్తుల తిరుమలలో పరిస్థితిని చూసి ముక్కున వేలేసుకుంటున్నారు.

    అయితే తాజాగా ఆరేళ్ల చిన్నారి చిరుత పులిదాడిలో మరణించడం సంచలనంగా మారింది. అలిపిరి కాలినడక మార్గంలో శుక్రవారం రాత్రి 8 గంటలకు ఈ ఘటన జరిగింది.  చిన్నారి లక్షిత సహా కుటుంబ సభ్యులు రాత్రి 11 గంటలకు లక్ష్మీనరసింహ స్వామి గుడి వద్దకు చేరుకున్నారు. ఇంకో గంటలో తిరుమలకు చేరుకోవాల్సి ఉంది. ఒక్క సారి గా చిరుత లక్షిత పై దాడి చేసి, అడవిలో కి లాక్కెళ్లింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు అందింది. అయితే రాత్రి కావడంతో గాలింపు చర్యలు ఫలించలేదు. ఉదయం అడవిలోనే సగం తినేసిన లక్షిత మృతదేహం దొరికింది.  అయితే గతంలోనూ బాలుడిపై చిరుత దాడి చేసి తీవ్రంగా గాయపర్చింది.

    తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నా, చిరుత పులుల సంచారం పెరిగిందని తెలిసినా అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టడంలో టీటీడీ విఫలమైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. టీటీడీ పాలకమండలిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. కాలినడక మార్గంలో  పూర్తి స్థాయి రక్షణ చర్యలు చేపట్టాలని భక్త జనం కోరుతున్నది. చిన్నారి లక్షిత కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తుున్నది. అలిపిరి నుంచి కాలినడక మార్గంలో చిరుత పులుల సంచారం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో భద్రతా చర్యలు విస్తృతం చేయాలనే అభిప్రాయం వినిపిస్తున్నది.

    Share post:

    More like this
    Related

    Prabhas : కాబోయే భార్యను పరిచయం చేయబోతున్న ప్రభాస్.. ఇన్ స్టా పోస్టు వైరల్ 

    Prabhas : డార్లింగ్స్ ఫైనల్లీ సమ్ వన్ వెరీ స్పెషల్ పర్సన్...

    RCB : బెంగళూరు ప్లే ఆఫ్స్ చేరాలంటే.. 

    RCB : ఐపీఎల్ సీజన్ చివరకు దశకు చేరుకుంది. ప్లే ఆఫ్స్...

    Rashmika Mandanna : ముంబయి అటల్ సేతు పై రష్మిక మందన్న ప్రశంసలు.. మోదీకి ఫ్లస్ 

    Rashmika Mandanna : ముంబయి అటల్ సేతు పై హిరోయిన్  రష్మిక...

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ బాడీగార్డు ఇంటిపై దాడి

    Pawan Kalyan : హైదరాబాద్ మీర్ పేటలోని లెనిన్ నగర్ లో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    AP Attacks : భగ్గుమంటున్న ఏపీ.. పెట్రోల్ బాంబులు, కత్తులతో దాడులు

    AP Attacks : ఏపీలో ఎన్నికలు పూర్తయినప్పటి.. ఆ వేడి మాత్రం...

    LokSabha Elections 2024 : తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైన ఎన్నికలు

    LokSabha Elections 2024 : తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్...

    Tirupati : తిరుపతిలో ఐదుగురు సీఐల బదిలీ

    Tirupati : సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానున్న వేళ మరికొందరు...

    TDP-YCP : నామినేషన్ ర్యాలీలో ఉద్రిక్తత – తిరుపతిలో యుద్ధం చేసిన వైసీపీ, టీడీపీ శ్రేణులు

    TDP-YCP : తిరుపతి కేంద్రంగా అధికార వైసీపీ, టీడీపీల మధ్య యుద్ధ...