ఆంధ్రలో బి ఆర్ ఎస్ పార్టీ ఖతం అయినట్లు సమాచారం అందుతోంది. బీఆర్ఎస్ లో ఉన్న తోట చంద్ర శేఖర్ జనసేనలోకి వెళుతున్నట్లు తెలుస్తోంది. ఇక రావెల కిషోర్ బాబు కుడా బీఆర్ ఎస్ ను వీడి వైసిపి లోకి జంప్ అవుతున్నట్లు సమాచారం అందుతోంది. త్వరలో పవన్ కళ్యాణ్ తో తోట భేటీ అవుతా రన్న టాక్ నడుస్తోంది.ఇక జనసేనలో తోట చంద్రశేఖర్ గుంటూరు పశ్చిమ టిక్కెట్ ఆశిస్తున్నట్లు తెలు స్తోంది. గుం టూరు స్వస్థలం కావడంతో పశ్చిమ నుంచి పోటీ చేసే ఆలోచనలో తోట చంద్రశేఖర్ ఉన్నారని సమాచారం అందుతోంది. గతంలో ప్రజారాజ్యం పార్టీ తరపున గుంటూరు పార్లమెంటుకు, 2019 ఎన్నికల్లో జనసేన తర ఫున గుంటూరు పశ్చిమ అసెంబ్లీలకి తోట చంద్రశేఖర్ పోటీ చేశారు. ప్రస్తుతం బిఆర్ఎస్ పార్టీ ఆంధ్ర ప్రదే శ్ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. పొత్తులో భాగంగా గుంటూరు పశ్చిమ సీటును జనసేనకు కేటా యించాలన్న ఆలోచనలో టిడిపి ఉన్నట్లు తెలుస్తోంది. టిడిపి, జనసేన లతో సన్నిత సంబంధాలను తోట చంద్రశేఖర్ కొనసాగిస్తున్నారు. ఆర్థికంగా బలమైన వైసీపీ అభ్యర్థి రజనీకి చెక్ పెట్టేందుకు.. జనసేన అభ్యర్థిగా తోట చంద్రశేఖర్ను రంగంలోకి దింపాలన్న ఆలోచనలో ఇరు పార్టీలు ఉన్నట్లు తెలుస్తోంది.