MLC Kavita : ఎమ్మెల్సీ కవితను ఇవాళ రెండో రోజు ఈడీ విచా రించనుంది. నేడు విచారణకు రావాల్సిందిగా కవిత భర్త అనిల్తో పాటు ఆమె వ్యక్తిగత సిబ్బంది లో ముగ్గురికి ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు.
సీజ్ చేసిన ఫోన్లను ఓపెన్ చేయడంతో పాటు మ ద్యం పాలసీకి సంబంధించిన పలు అంశాలపై వారి ని ప్రశ్నించనున్నట్లు సమాచారం.మరోవైపు నిన్న కవితను కలిసిన కేటీఆర్, హరీశ్ రావు ఢిల్లీలోనే ఉన్నారు.
లిక్కర్ స్కామ్ కేసులో కవితను అరెస్టు చేసిన పోలీసులు నిన్న మొదటి రోజు సుదీర్ఘంగా విచారించారు. నేడు కూడా ఆమెను ఈడీ అధికారులు విచారించరున్నారు. కవితతో పాటు ఆమె వ్యక్తిగత సిబ్బంది ని కూడా అధికారులు విచారించనున్నారు.