31.9 C
India
Friday, May 17, 2024
More

    Revanth-Jagan : జగన్ బాటలో రేవంత్.. త్వరలో వాటికి శ్రీకారం!

    Date:

    Revanth-Jagan
    Revanth-Jagan

    Revanth-Jagan : ఏపీ సీఎం వైఎస్ జగన్ తీసుకువచ్చిన వలంటీర్ వ్యవస్థపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు కురిపిస్తోన్న సంగతి తెలిసిందే. తెలంగాణలో కూడా దీన్ని అమలు చేస్తారన్న సమాచారం.. జగన్‌మోహన్ రెడ్డి ఏపీ పగ్గాలు చేపట్టిన తర్వాత ప్రజలకు ప్రభుత్వం అందించే ప్రతీ పథకం అందాలనే వలంటీర్ వ్యవస్థను తెచ్చారు. సంక్షేమ ఫలితాలు లబ్ధిదరులకు నేరుగా అందాలని, ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వ నిర్ణయాలు ప్రజలకు తెలియాలని, వృద్ధులు,  వికలాంగులకు వారి గడప వద్దకు పథకల ఫలితాలు వెళ్లాలి అనే సీఎం జగన్ వలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టారు.

    ఈ వలంటీర్ వ్యవస్థను చాలా రాష్ట్రాలు పరిశీలించాయి. ఇదే విధంగా తెలంగాణలో కూడా వలంటీర్ వ్యవస్థను తీసుకు రావాలని సీఎం చూస్తున్నారని తెలుస్తోంది. ప్రతీ పథకం లబ్ధిదారుడికి చేరేలా వలంటీర్ వ్యవస్థను తీసుకస్తానని చెప్పాడు. ఆ దిశగా కర్యాచరణ చేపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రజలకు 6 గ్యారెంటీలు చేరువయ్యేలా చూడాలని రేవంత్ చూస్తున్నారు. ఈ క్రమంలోనే ‘ఇందిరమ్మ కమిటీ’ ఏర్పాటు చేసేందుకు సమాలోచనలు చేస్తున్నారు. కమిటీల్లో నియమితులైన వారికి గౌరవ వేతనం ఇవ్వనున్నట్లు సమాచారం.

    తెలంగాణలో కాంగ్రెస్ విజయాన్ని సాధించింది.. ఇప్పుడు పార్లమెంట్ లో కూడా అదే రిజల్ట్ తీసుకువచ్చేందుకు కృషి చేస్తుంది. ఇందులో భాగంగానే పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థులను పోటీలో దింపింది. భువనగిరి లోక్‌సభ నియోజకవర్గం ఎన్నికల సమీక్షలో సీఎం నేతలకు దిశా నిర్దేశం చేశారు. ఇందులో కీలక ప్రకటన చేశారు. ఏపీ సీఎం జగన్ అమలు చేస్తున్న వలంటీర్ విధానానికి  రెస్పాన్స్ వస్తుంది.. ఇదే తరహాలో తెలంగాణలో కూడా తీసుకువస్తాం. ఇప్పటికే 6 గ్యారెంటీల పేరుతో తెలంగాణలో పథకాలు అమలవుతున్నాయి. ఈ నేపథ్యంలో పథకాలను ప్రజలకు చేరవ చేసేందుకు ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.

    Share post:

    More like this
    Related

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ బాడీగార్డు ఇంటిపై దాడి

    Pawan Kalyan : హైదరాబాద్ మీర్ పేటలోని లెనిన్ నగర్ లో...

    Urvashi Rautela : పింక్ డ్రెస్ లో ఊర్వశి రౌతేలా.. కేన్స్ 2024లో సందడి చేసిన గ్లామర్ క్వీన్..

    Urvashi Rautela : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్...

    Jr NTR : ఆలయానికి భారీ విరాళం అందించిన యంగ్ టైగర్.. ఎంతంటే?

    Jr NTR : కోట్లాది మంది అభిమానుల చేత ‘మ్యాన్ ఆఫ్...

    Sunrisers Hyderabad : ప్లే ఆఫ్స్ కు సన్ రైజర్స్..  మిగిలిన ఒక్క స్థానం ఎవరికో

    Sunrisers Hyderabad : ఉప్పల్ లో గురువారం జరగాల్సిన గుజరాత్ టైటాన్స్,...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Congress : కాంగ్రెస్ నాయకులకు సోకిన ఎన్నికల జ్వరం 

    Congress : తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ నాయకులకు పార్లమెంట్ ఎన్నికల జ్వరమే...

    Kishan Reddy : రెండంకెల ఎంపీ స్థానాలు గెలుస్తాం: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

    Kishan Reddy : రెండంకెల ఎంపీ స్థానాలు గెలిచి తెలంగాణలో బీజేపీ...

    Jagan : అనుకున్నది ఒకటి.. అయ్యింది మరొకటి..!

    Jagan : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి...

    Uttam Kumar Reddy : తడిసిన ధాన్యాన్నీ మద్దతు ధరకు కొనుగోలు చేస్తాం – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

    Uttam Kumar Reddy : ఇటీవల కురిసిన వానలకు తడిసిన ధాన్యాన్ని...