2thousand Crores : అనంతపురం జిల్లా పామిడి వద్ద పెద్ద ఎత్తున కరెన్సీ నోట్లను పోలీసులు పట్టుకున్నారు. ఎన్నికల కోడ్ కారణంగా పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా నాలుగు కంటైనర్లను ఆపి తనిఖీ చేశారు. ఒక్కో కంటైనర్ లో రూ. 500 కోట్ల చొప్పున మొత్తం రూ.2 వేల కోట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
అయితే పోలీసులు ఈ కంటైనర్లలోని డబ్బుకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. ఈ డబ్బు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి చెందనదిగా తేల్చారు. రూ.2 వేల కోట్ల నగదును ఆర్బీఐ కొచ్చి నుంచి హైదరాబాద్ కు తరలిస్తోందని అధికారులు తెలిపారు. రికార్డులన్నీ సక్రమవంగా ఉండడంతో ఆ కంటైనర్లను అధికారులు పంపించి వేశారు.