తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆటో డ్రైవర్లకు,గిగ్ కార్మికులకు శుభవార్త చెప్పారు. కాంగ్రేస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆరు గ్యారెంటీలలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది. దీంతో వేలాది మంది ఆటో కార్మికులు తమకు ఉపాధి తగ్గిపోతుందని ప్రభత్వం పై మండిపడుతూ ఆందోళను చేశారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో,క్యాబ్ డ్రైవర్ల సంక్షేమంకోసం కూడ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుందని సీయం చెప్పారు. అందరు బాగుండానే ఉద్దేశం తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గిగ్ కార్మికులు తో పాటుగా క్యాబ్,ఆటో డ్రైవర్లకు 5 లక్షల ప్రమాద బీమా ప్రకటించింది. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా వీరి సమస్యలను సంక్షేమాన్ని పట్టించుకోలేదని మెట్టమెదటి సారిగా కాంగ్రెస్ ప్రభుత్వం కార్మిల కోసం కృషిచేస్తుందని సీయం తెలిపారు.