CM Revanth : రిజర్వేషన్లను ఎత్తివేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పై దుష్ప్రచారం చేసి ఎలాగైనా విజయం సాధించాలని బీజేపీ చూస్తోందని అన్నారు. ‘రాజ్యాంగ ప్రాథమిక సూత్రాలపై బీజేపీ దాడి చేస్తోంది. అన్ని రకాల వ్యవస్థలు, సంస్థలు ఉపయోగించుకొని 400 సీట్లు గెలువాలనుకుంటోంది. అక్రమంగా, దౌర్జన్యంగా గెలవాలని ప్రయత్నిస్తోంది. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా మోదీ, అమిత్ షా వ్యవహరిస్తున్నారు. రిజర్వేషన్లు అడ్డం పెట్టుకుని లబ్ధి పొందాలని చూస్తున్నారు’ అని సీఎం రేవంత్ ఫైర్ అయ్యారు.
ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఎన్డీయే పాలనపై హైదరాబాద్ గాంధీ భవన్ లో చార్జ్ షీట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ మోదీ సర్కార్ దేశంలోని కార్పొరేట్ సంస్థలకు లొంగిపోయి పనిచేస్తుందన్నారు. గత ప్రధానులందరూ కలిసి రూ. 54 లక్షల కోట్లు అప్పులు చేస్తే ప్రధాని మోదీ మాత్రం రూ. 113 లక్షల కోట్ల అప్పలు చేశారని చెప్పారు.