CM Revanth : రూ. 2 లక్షల రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈ రోజు నిజామాబాద్ లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జన జాతర సభలో సీఎం మాట్లాడుతూ ఎన్నికల కోడ్ ముగియగానే రుణమాఫీ ప్రక్రియ ప్రారంభిస్తామని, పంద్రాగస్టు లోపు రైతులకు రుణ మాఫీ చేసీ తీరుతామని ప్రకటించారు. గత ఎన్నికల్లో పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తానని బాండ్ పేపర్ రాసిచ్చి బీజేపీ ఎంపీ మోసం చేశారని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే ఐదు గ్యారంటీలను అమలు చేశాం. ఆరో గ్యారంటీ రుణమాఫీ చేపట్టే లోపే ఎన్నికల కోడ్ వచ్చిందని సీఎం తెలిపారు. జీవన్ రెడ్డిని గెలిపిస్తే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా నియమించే బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. సెప్టెంబర్ 17 లోపు ఈ ప్రాంత చక్కెర కర్మాగారాన్ని తెరిపించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని తెలిపారు.