Ponnam Prabhakar : మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏప్రిల్ 27వ తేదీ శనివారం జగిత్యాల జిల్లాలోని కథలాపూర్, మేడిపల్లి, భీమారం మండల కేంద్రాల్లో ఎన్నికల ప్రచార ర్యాలీలు, కార్నర్ మీటింగుల్లో మంత్రి పాల్గొని మాట్లాడారు.
కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోతే, లిక్కర్ స్కాంలో బిడ్డ జైలుకు పోతే.. ప్రభుత్వాన్ని కూలగొడతానని మాజీ ముఖ్యమంత్రిగా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలుచేస్తుంటే.. జీర్ణించుకోలేని బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నాయని దుయ్యబట్టారు. డబుల్ బెడ్రూం, నిరుద్యోగ భృతి, దళితులకు మూడెకరాలు భూమి ఇవ్వని బీఆర్ఎస్ పార్టీ నా మిమ్మల్ని ప్రశ్నించేది.? అని అగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణను నాశనం చేసింది ఎవరని ప్రశ్నించారు. తెలంగాణలో ఏం దిద్దుదామని తిరుగుతన్నావు అంటూ కేసీఆర్ పై నిప్పులు చెరిగారు.