Congress MP Candidate : ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఒడిశా నుంచి ఎన్నికల బరిలో నిలబడిన పూరీ ఎంపీ అభ్యర్థి సుచరిత మొహంతీ తన టికెట్ ను వెనక్కు ఇచ్చేశారు. తనకు ఎన్నికలలో ఖర్చు చేయడానికి పార్టీ ఎలాంటి ఫండ్స్ ఇవ్వడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తనకు సొంతంగా ఎన్నికల ఖర్చులను భరించే స్తోమత లేని కారణంగా పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ఆమె తెలిపారు. ఈ మేరకు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కు ఈ విషయమై లేఖ రాశారు.
పూరీ లోక్ సభ స్థానానికి ఆరో విడతలో భాగంగా మ0 25న పోలింగ్ జరగనుంది. నామినేషన్ల సమర్పణకు మే 6 వరకు గడువు ఉంది. సుచరిత ఇప్పటి వరకు నామినేషన్ దాఖలు చేయలేదు. నామినేషన్ల గడువు మరో రెండు రోజుల్లో ముగియనున్న వేళ ఆమె టికెట్ వెనక్కి ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీకి కొత్త తలనొప్పి మొదలైంది.