RGV : సీఎం రేవంత్ రెడ్డి ఆర్జీవీ చెంతకు చేరారు. మూవీ డైరెక్టర్స్ అసోసియేషన్ వారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఇందులో రామ్ గోపాల్ వర్మ కూడా ఉన్నారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి అసోసియేషన్లలో కలిసి పని చేయని, మీటింగ్ లకు వెళ్లని ఆర్జీవీ ఒక్కసారిగా ఇలా రేవంత్ రెడ్డి వద్ద ప్రత్యక్షం కావడం చూస్తుంటే ఏదో ఉందని అందరూ తెగ కామెంట్స్ చేస్తున్నారు.
ఏపీ లో ఎన్నికలు పూర్తయినప్పటి నుంచి ఆర్జీవీ కామెంట్స్ చేయడం మానేశాడు. అయితే మొన్నటి వరకు ఇష్టారీతిన కామెంట్స్ చేసిన ఆర్జీవీ సైలెంట్ అయిపోయారు. ఏపీలో ఎన్నికలు ముగిసి జూన్ 4 న రిజల్ట్ రాబోతుంది. అందరూ టీడీపీ అధికారంలోకి వస్తుందని అనుకుంటున్నారు. ఈ సమయంలో ఎలాంటి కామెంట్ చేసినా చివరకు అది తనను ఇబ్బందులకు గురి చేస్తుందని ఆర్జీవీ భావిస్తున్నారు.
ఆర్జీవీ మొన్నటి వరకు చేసిన పోస్టులకు వైసీపీ నంచి డబ్బులు తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో సోషల్ మీడియాలో ఇన్ని రోజులు చేసిన ప్రచారం పేమెంట్ తీసుకుని చేసిందా అని ట్రోలర్స్ ఆర్జీవీని ఆట పట్టిస్తున్నారు. ఆర్జీవీ చాలా రోజులుగా టీడీపీ, జనసేనకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు చేసిన పనుల తీరుకు సంబంధించి సినిమాలు కూడా తీశారు. పూర్తిగా యాంటీ టీడీపీ పనులు చేసిన ఆర్జీవీ ఒక్కసారిగా తెలంగాణ సీఎంను కలవడంపై ఏమిటా అని చర్చ నడుస్తోంది.
ఆర్జీవీ తన మూవీస్ తోనే కాకుండా వివాదాస్పద వ్యాఖ్యలతోనే ఫేమస్ అయ్యారు. మరి ఎన్నికల ఫలితాల తర్వాత అతడి పరిస్థితి ఎలా ఉంటుందోననే భయంతోనే రేవంత్ రెడ్డిని కలిశాడు. ఆర్జీవీ సాధారణంగా రాజకీయ నాయకులను కలవడానికి ఇష్టపడడు. కానీ డైరెక్టర్స్ అసోసియేషన్ తరఫున ఇలా కలవడం చూస్తుంటే దేనికో ఆర్జీవీ భయపడుతున్నట్లు తెలుస్తోంది. ఆర్జీవీకి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు.