ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలుల వల్ల తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. జనవరి ఒకటి నుంచి చలి తీవ్రత మరింత పెరుగుచ్చని ప్రజలు జాగ్రతా ఉండాలని అధికారులు తెలిపారు. కాబట్టి వచ్చే రెండు రోజులు రాత్రి రెండు గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు దట్టమైన పొగ మంచు కమ్ముకునే అవకాశం ఉందని పేర్కొంది. దీనివల్ల రోడ్లపై కనుచూపుమేరా ఏమి కనిపించకపోవచ్చని వాహనదారులు జాగ్రత్త వహించాలని సూచించారు.