ఉస్మానియా పీజీ హాస్టల్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకోంది. పీజీ హాస్టల్ ముందు విద్యార్థులు ఆందోళన చేపట్టారు. హాస్టల్లోకి చొరబడిన దుండగుడిని తరలిస్తుండగా విద్యార్థినులు అడ్డుకోవడంతో ఉద్రిక్రత చో టు చేసుకుంది. అర్ధరాత్రి గోడదూకి హాస్టల్లోకి ముగ్గురు దుండగులు ప్రవేశించి విద్యార్థిని కి కిటికీ నుంచి సైగలు చేసారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు రక్షణ లేదంటూ విద్యార్థి నులు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమకు సెక్యూరిటీ కల్పించాలంటూ ఆందోళన వీసీ వచ్చి హామీ ఇస్తేనే కానీ కదలమంటూ ధర్నా చేస్తున్నారు.