Extra-marital Affair Head Constable Suicided in Kadapa : వివాహేతర సంబంధం పండింటి కుటుంబాన్ని నాశనం చేసింది. ఇద్దరు కూతుళ్లతో సహా నలుగురు వివాహేతర సంబంధం కాటుకు బలయ్యారు. ఈ వార్త కడపలో దావానంలా వ్యాపించింది. సమీపంలో నివసించే వారు ఉదయం వరకు విగత జీవులుగా కనిపించడంతో నలుగురి మృతదేహాలను చూసిన స్థానికుల కన్నీరు మున్నీరయ్యారు. దర్యాప్తు చేసిన పోలీసులు దీనికి వివాహేతర సంబంధమే కారణమని నిర్ధారించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం..
మృదుస్వభావి, అందరితో కలిసి ఉండే వెంకటేశ్వర్ కడప పట్టణంలోని టై టౌన్ పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ హోదాలో రైటర్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. కడపలోని కోపరేటివ్ కాలనీలో కుటుంబంతో సహా కలిసి ఉంటున్నాడు. అతనికి భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సంతోషంగా సాగుతున్న ఆయన జీవితంలోకి వితంతువు రమాదేవి వచ్చింది. ఆమెతో వెంకటేశ్వర్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయంలో కాలనీతో పాటు ఇరు కుటుంబాల వారు ఆశ్చర్యానికి గురయ్యారు. మృదుస్వభావి, అందరితో కలివిడిగా ఉండే వెంకటేశ్వర్ వివాహేతర సంబంధం పెట్టుకోవడం అందరినీ ఆశ్యర్యానికి గురి చేసింది.
గురువారం డ్యూటీ ముగించుకొని వచ్చిన వెంకటేశ్వర్ తిరిగి మళ్లీ స్టేషన్ కు వెళ్లి తన తుపాకీని వెంట తెచ్చుకున్నాడు. నిద్రిస్తున్న భార్య మాధవి(47), పిల్లలు లాస్య(19), అభుజ్ఞ(16)ను కాల్చి చంపాడు. అనంతరం తను కాల్చుకొని సూసైడ్ చేసుకున్నాడు.
ఇక, తన ఆస్తులు, పింఛన్ డబ్బు, పాలసీలు అన్నీ తన వివాహేతర భాగస్వామి అయిన రమాదేవికి చెందాలని రెండు బాండ్ పేపర్లు రాశాడు. రమకు గానీ, ఆమె కుమారుడు నాగలోకేశ్వర్ రెడ్డికి గానీ తన ఉద్యోగం కేటాయించాలని ఎస్పీని కోరారు.
వివాహేతర సంబంధం కేవలం ఆస్తులు, ధనలాభం కోసం వెంకటేశ్వర్ ను, అతని కుటుంబాన్ని ఆత్మహత్యకు ప్రేరేపించి ఉండొచ్చని ప్రజలు చర్చించుకుంటున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.