NTR Coin :
అయితే ఈ నాణెంలో 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింకుతో తయారు చేశారు. చారిత్రక ఘటనల ప్రముఖుల గుర్తుగా వెండి నాణెలు విడుదల చేయడం ఆనవాయితీగా వస్తున్నది. మొదటిసారిగా జవహర్ లాల్ నెహ్రూది రిలీజ్ చేశారు. ఇక తెలుగు చలన చిత్ర రంగంలో మరెవరికీ అందనంత ఎత్తుకు ఎదిగారు అన్న ఎన్టీఆర్. రాజకీయ రంగంలోనూ రికార్డులను సృష్టించారు. ఆంధ్రుల ఆత్మగౌరవం పేరిటా 1982లో తెలుగు దేశంపార్టీని పెట్టి చరిత్ర సృష్టించారు. పార్టీ స్థాపించి తొమ్మిది నెలలు తిరక్కుండానే, రికార్డు విజయం సాధించారు. ప్రజాస్వామ పునరుద్ధరణ అంటూ ఆక్ష్న చేసిన పోరాటం చరిత్రలో మైలురాయిలా నిలిచింది. ఎన్టీఆర్ అనే మూడక్షరాలను మకుటం లేని మహారాజుగా చరిత్ర పుటల్లో నిలబెట్టింది.
ప్రస్తుతం ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న పురందేశ్వరి పలువురు ప్రముఖులకు ఈ ఆహ్వానాలు పంపిస్తున్నారు. తన తండ్రి, గ్రేట్ లీడర్, లెజండరీ యాక్టర్ ఎన్టీఆర్ పేరిట విడుదల చేస్తున్న నాణెనికి సంబంధించిన కార్యక్రమానికి హాజరు కావాలని కోరుతున్నది. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నట్లు సమాచారం. దీంతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు, తెలుగు రాష్ర్టాల్లోని పలువురు రాజకీయ, సినిమా ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నట్లు సమాచారం.