TDP@42 : తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పార్టీ అభిమానులకు ,కార్యకర్తలకు చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. మహాశయుల స్ఫూర్తిగా 1982లో నంద మూరి తారక రామారావు ఈ తెలుగుదేశం పార్టీని పట్టాహాసo గా స్థాపించారు.
రాజకీయమంటే అధికార అనుభవించడం కాదని ప్రజలకు సేవ చేయడం అని ఎన్టీఆర్ నేర్పించారని చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆనాటి నుంచీ నేటి వరకు తెలుగు ప్రజల ఖ్యాతి, అభ్యున్నతి లక్ష్యంగా పార్టీ ప్రజల సేవలో నిమగ్నమైందని ఆ యన తెలిపారు. ఇక ముందు కూడా ఇదే అంకితభావంతో కృషి చేస్తుందని చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.
తెలుగు వారి ఆత్మగౌరవం కోసం ఏర్పాటుచేసిన పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో సినిమాలలో వదిలిపెట్టి నందమూరి తారక రామారావు రాజకీయాల్లోకి అడుగు పెట్టా రు.
తెలుగుదేశం పేరుతో ఆయన పార్టీని స్థాపించి ము ఖ్యమంత్రిగా కూడా ఈ రాష్ట్రానికి సేవలు అందిం చారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం పుట్టిన ఈ పార్టీ తెలుగు ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది అనడంలో ఇలాంటి సందేహము లేదు.