Bhashyam Praveen Nomination : పెదకూరపాడు నియోజకవర్గ టిడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ ఈరోజు నామినేషన్ వేయనున్నారు. ముందుగా అమరావతి అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి ర్యాలీ నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు ర్యాలీ ప్రారంభించనున్నారు. పెదకూరపాడు ఎమ్మార్వో కార్యాలయం వరకు ర్యాలీని నిర్వహించిన అనంతరం ఉదయం 11 గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నారు.
ఈ సందర్భంగా టిడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం మాట్లాడుతూ ర్యాలీలో టిడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ఆప్తులు పెద్ద ఎత్తున పాల్గొని తన నామినేషన్ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని కోరారు.