Sharmila : ‘నవ సందేహాలు’ పేరుతో సీఎం జగన్ కు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరో లేఖ రాశారు. ఇటీవలే 9 ప్రశ్నలతో లేఖ సంధించిన షర్మిల మరో లేఖను విడుదల చేసింది.
షర్మిల నవ సందేహాలు..
1. మీరు ప్రకటన చేసినట్లు మద్య నిషేధం హామీ ఎక్కడ.? పాక్షికంగానైనా అమలవుతోందా.?
2. మూడు దశల్లో మద్య నిషేధం అమలు చేస్తామన్నారు. నిషేధం తర్వాతే మళ్లీ ఓట్లు అడుగుతామన్నారు.. ఏయైంది.?
3. మద్యం అమ్మకాలతో ఆదాయాన్ని రూ. 30 వేల కోట్లకు పెంచుకున్నారు.
4.గతంలో మద్యంపై ఆదాయం అంటే.. ప్రజల రక్తమాంసాల మీద వ్యాపారం అన్నారు. మీరు చేస్తున్నది ఏంటి.?
5. ఎక్కడ దొరకని బ్రాండ్లు, కనీవినీ ఎరగని బ్రాండ్లు ఇక్కడే అమ్ముతూ ప్రజల ప్రాణాలతో ఎందుకు చెలగాటం ఆడుతున్నారు?
6. బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా 11 వేల కోట్ల రుణాలు ఎందుకు సేకరించాలని అనుకున్నారు?
7. బెవరేజెస్ కార్పొరేషన్ ను చేయూత, ఆసరా, అమ్మఒడి అమలు బాధ్యత అప్పగించడాన్ని ఎలా సమర్థిస్తారు?
8. మాదకద్రవ్యాలు పట్టుబడుతున్న రాష్ట్రాల్లో ఏపీ మొదటి స్థానం ఎందుకు ఉంది?
9. రాష్ట్రంలో 20.19 లక్షల మంది మాదక ద్రవ్యాలకు అలవాటుపడ్డారు అంటే మీ వైఫల్యం కాదా..?