Ameesha Patel : లేటు వయసులో ఘాటు ఫొటోలతో అమీషా పటేల్ యువతరాన్ని ఉర్రూతలూగిస్తోంది. ఈ అమ్మడు పవన్ కల్యాణ్ బద్రీ సినిమాలో హిరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ఇప్పటి యువకులకు ఈ ముద్దుగుమ్మ పవన్ తో యాక్ట్ చేసిందంటే గానీ నమ్మకం కుదరడం లేదు. అమీషా పటేల్ నాని సినిమాలో కూడా మహేశ్ బాబు సరసన నటించి మెప్పించింది.
అమీషా పటేల్ కు ఇప్పుడు 43 సంవత్సరాలు ఉంటాయి. కానీ ఈ అమ్మడు ఇంత లేటు వయసులో బికినీలో అందాలు ఆరబోస్తూ ఫొటోలకు ఫోజులిచ్చింది. సోషల్ మీడియా లో వాటిని షేర్ చేస్తూ యువకులను రెచ్చగొడుతుంది. అయితే బద్రీ, నాని సినిమాల తర్వాత అమీషా ఎక్కువగా కనిపించలేదు. బద్రీ అనంతరం అమీషా బాలీవుడ్ కు వెళ్లిపోయింది. అక్కడ అనేక సినిమాల్లో నటించింది.
అమీషా తరచు వివాదాల్లో నిలుస్తూనే ఉంది. ఈ మధ్య ఓ సినిమా నిర్మాణం కోసం విజయ్ కుమార్ అనే వ్యక్తి వద్ద రెండు కోట్ల రూపాయలు తీసుకుంది. ఆ సినిమా నిర్మాణం మధ్యలోనే ఆగిపోవడంతో రెండు కోట్ల రూపాయలు తిరిగి ఇచ్చేయాల్సి వచ్చింది. కానీ అమీషా ఇచ్చిన రెండు కోట్ల రూపాయల చెక్ బౌన్స్ అయింది. దీంతో ఈ అమ్మడు చెక్ బౌన్స్ కేసులో కోర్టులు, పోలీసుల చుట్టూ తిరగాల్సి వస్తోంది.
నలబై దాటినా కూడా తన హాట్ హాట్ అందాలను కురిపిస్తూ భలే ఉందనే విధంగా అమీషా కనిపిస్తోంది. బాలీవుడ్ లో గదర్ 2 సినిమా తో మళ్లీ విజయాన్ని అందుకున్న ఈ భామ బికినీ లో భారీ అందాలను చూపిస్తూ కుర్రకారు మతి పోగోడుతుంది. అమీషా పటేల్ టీనేజ్ వయసులో మోడల్ గా కూడా పని చేసింది. బద్రీ సినిమాలో చాలా క్యూట్ క్యారెక్టర్ చేసిన ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత గ్లామర్ డోస్ పెంచి బాలీవుడ్ లో రాణించింది. ఈ పాల బుగ్గల సుందరికి ఇప్పటికీ ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. వారిని ఖుషీ చేయడానికే ఇలాంటి ఎక్స్ ఫోజింగ్ ఫోటోలు షేర్ చేస్తూ గుర్తింపు తెచ్చుకుంటోంది.
View this post on Instagram