![Kidney Stones](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/05/P-4-15.jpg)
Kidney Stones : పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురానికి చెందిన ఒక మహిళ కిడ్నీలో నుంచి 77 రాళ్లను వైద్యులు తొలగించిన సంఘటన పాలకొల్లు ప్రైవేటు ఆసుపత్రిలో జరిగింది.
పాలకొల్లు జనతా ఆస్పత్రిలో వైద్య పరీక్షల కోసం ఓ మహిళ వచ్చింది. వైద్యుల పరీక్షిస్తుండగా ఆమె కిడ్నీలో రాళ్లు ఉన్నట్లు గుర్తించారు. మంగళవారం శస్త్ర చికిత్స చేసి 77 రాళ్లను తొలగించారు. ప్రస్తుతం ఆ మహిళ ఆరోగ్యంగా ఉన్నారని పాలకొల్లు జనతా ఆస్పత్రి వైద్యులు తెలిపారు.
కిడ్నీలో రాళ్లు ఏర్పడడానికి అనేక కారణాలు ఉన్నాయి. మూత్రపిండాల నుండి మూత్రాశయం వరకు తరచుగా మూత్రం కేంద్రీకృతమై ఉన్నపుడు రాళ్లు ఏర్పడతాయి. వీటిలో ఖనిజాలు స్ఫటికీకరణగా కలిసి ఉంటాయి. ఏది ఏమైనా ఒకేసారి 77 రాళ్లను కిడ్నీలో నుంచి తొలగించడం అభినందనీయం.