![Inter Supplementary Exams](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/05/P-1-15.jpg)
Inter Supplementary Exams : రేపటి (శుక్రవారం) నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అనుమతిస్తారు. వార్షిక పరీక్షల్లోనూ విద్యార్థులకు ఇదే వెసులుబాటు కల్పించారు. శుక్రవారం నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.ఉదయం 9.05 గంటలు, మధ్యాహ్నం 2.35గంటల వరకు పరీక్ష రాసేందుకు అనుమతిస్తారు. ఆ తర్వాత వచ్చేవారిని అస్సలు అనుమతించరు.
జూన్ 3 వరకు జరిగే ఈ పరీక్షలను ఉదయం 9 గంటల నుంచి మధ్యా హ్నం 12 గంటల వరకు ఫస్టియర్ విద్యార్థులకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సెకండియర్ విద్యార్థులకు నిర్వహిస్తారు. మొత్తం 4.6 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 900 పరీక్షాకేంద్రాలను ఇంటర్బోర్డు ఏర్పాటుచేసింది. విద్యార్థులు https://tsbie.cgg.gov.in వెబ్సైట్ నుంచి హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చునని అధికారులు తెలిపారు.