Road Accident : ఏపీలోని అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. విశాఖపట్నం నుంచి తుని వైపు వెళ్తున్న కారు వెదులపాలెం జంక్షన్ వద్దకు రాగానే డివైడర్ ను ఢీకొని అవతలి వైపు వస్తున్న లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. కారు డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఆయనను నక్కపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
విశాఖ నగరంలోని గోపాలపట్నంకు చెందిన శరగడం వెంకటలక్ష్మి, కుమారుడు వికాస్, అగనంపూడికి చెందిన దాడి గగన్, విశాఖకు చెందిన సుంకర మధుకర్ లు కాకినాడ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వికాస్ ఒక్కడు తీవ్రగాయాలతో బయటపడగా మిగతా ముగ్గురు మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.