Chandrababu : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుతున్నారు. విమర్శకు ప్రతి విమర్శ చేసుకుంటున్నారు.హామీల వర్షం కురిపిస్తున్నారు.జగన్ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదో చెప్పాలంటూ ప్రతిపక్ష నాయకులు విమర్శిస్తున్నారు.జగన్ కు ఒకవైపు కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల తన అన్నపై విమర్శలు గుప్పిస్తూనే ఉంది. మరోవైపు జగన్ ఓడించడానికి కూటమిగా తెలుగుదేశం,జనసేన,భారతీయ జనతాపార్టీ లు కూటమిగా ఏర్పడ్డాయి. కూటమి పార్టీలు కూడా జగన్ ను ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ వాయించేస్తున్నారు. రెండు వర్గాలను ఎదుర్కొని గత ఎన్నికల్లో మాదిరిగానే ఒంటరి పోరాటంతో రెండోసారి అధికారాన్ని దక్కించుకోడానికి జగన్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
విజయనగరం జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్,టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు నాయుడు ఘాటుగా జగన్ విమర్శిస్తున్నారు. సభకు వచ్చిన జనాన్ని చూసిన చంద్రబాబుకు ఉత్సహం రెట్టింపు అయినట్టు ఉంది. జనాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్న క్రమంలో ప్రజలు ఉహించనివిదంగా చంద్రబాబు నోరుజారాడు. వెంటనే నాలుక కరుచుకున్నాడు. అయినా ఏముంది. నోరు జారింది. జనం నవ్వుకున్నారు.సభలో పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి మాట్లాడుతూ పైసాకు కూడా పనికి రాణి పవన్ కళ్యాణ్ అంటూ నోరు జారాడు చంద్రబాబు నాయుడు. ఒక్కసారిగా తెలుగు తమ్ములు,జనసేన సైనికులు ముక్కున వేలేసుకున్నారు. బాబుకుఏమైనది. ఉపన్యాసంలో పస తగ్గింద అంటూ జనం అనుకోవడం వినిపించింది. పవన్ కళ్యాణ్ పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అనంతరం రాష్ట్రంలో కరెంట్ కోతలు విపరితంగా ఉన్నాయి. జగన్ ప్రభుత్వంలో కరెంట్ ఎప్పుడు వస్తుందో,ఎప్పుడు రాదో తెలియని పరిస్థితి ఉంది తమ్ముళ్లు.కూటమి ప్రభుత్వం వస్తేనే మీకు కరెంట్ కోతలు ఉండవు. మీ ఊళ్ళో కరెంట్ కోతలు కూడా ఉన్నాయి అంటూ చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో పలువురు కరెంట్ కోతలు లేవు,లేవు,లేవు అంటూ చేతులు ఊపుతూ కనిపించడం జరిగింది. బాబు కరెంట్ ప్రసంగానికి వ్యతిరేకంగా జనం నుంచి స్పందన రావడంతో ఆయన కొంతసేపు ఆలోచించుకోవాల్సిం పరిస్థితి ఏర్పడింది.