National Film Award : 2021 సంవత్సరానికి సంబంధించి జాతీయ చలన చిత్ర అవార్డుల్లో ఫస్ట్ టైం టాలీవుడ్ సినిమాలు తమ సత్తా చాటాయి. తెలుగు ఇండస్ట్రీ సత్తా ఇప్పుడు జాతీయ స్థాయిలో చాటుకుంటుంది. ఉత్తమ సినీ దర్శకుడు విభాగంలో 11 పురస్కాలను టాలీవుడ్ ఇండస్ట్రీ దక్కిచుకుంది. 69 సంవత్సరాల అవార్డుల చరిత్రలో ఇప్పటి వరకు రాని గుర్తింపు ఇప్పుడు అల్లు అర్జున్ దక్కించుకున్నారు. ఇక ఈ సారి ఆస్కార్ సాధించిన సినిమా ‘ఆర్ఆర్ఆర్’ ఏకంగా ఆరు అవార్డులను సొంతం చేసుకుంది.
ఇక్కడ చాలా మందికి వివిధ రకాల అనుమానాలు కలిగాయి. 2022లో రిలీజైన సినిమాలను 2021 సంవత్సరానికి సంబంధించి అవార్డులను ఎలా అందజేశారు. ఈ సారి జాతీయ చలన చిత్ర అవార్డులను దక్కించుకున్న సినిమాలు విడుదలైన సంవత్సరం పరిశీలిస్తే ఆర్ఆర్ఆర్-మార్చి, 2022, రాకెట్రీ-జూలై, 2022, గంగూబాయ్ కఠియావాడి-ఫిబ్రవరి, 2022 ఉన్నాయి. ఇందులో ఆర్ఆర్ఆర్ కు 6, గంగూబాయ్ కి ఉత్తమ నటిగా అలియాభట్ ను అవార్డు వరించింది. ఇక ఉత్తమ జాతీయ చలన చిత్రంగా ‘రాకెట్రీ’ నిలిచింది.
దీనిపై వచ్చిన అనుమానాలను సమాచార, ప్రసార శాఖ అదనపు కార్యదర్శి నీర్జా శేఖర్ నివృత్తి చేశారు. ఆయన మటల్లోనే.. ‘జాతీయ చలన చిత్ర అవార్డు నిబంధల ప్రకారమే అందజేశాం. 2021, జనవరి 1 నుంచి 2021, డిసెంబర్ 31 వరకు ఈ సినిమాలు సెన్సార్ సర్టిఫికెట్ ను పొందాయి. కాబట్టి ఈ సినిమాల రిలీజ్ 2022లో జరిగినా.. నిబంధనల ప్రకారం 2021గానే పరిగణిస్తాం. 2021 డిసెంబర్ ఆర్ఆర్ఆర్ సినిమా సెన్సార్ పూర్తి చేసుకొని యూ/ఏ సర్టిఫికెట్ పొందింది. కాబట్టి ఈ సినిమాను 2021 సంవత్సరానికి గానూ పురస్కారం జాబితాలో తీసుకున్నాం, ఇలానే మిగిలిన చిత్రాలను కూడా జాబితాలో చేర్చాం’ అని చెప్పారు.