Girl Friend : వివాహేతర సంబంధాలు ఎంతటి దుష్పరిణామాలు నిత్యం చూస్తూనే ఉన్నాం. సహజీవనం విచ్చిన్నం కావడంతో యువతి ప్రియుడి కుమారుడిని చంపిన ఢిల్లీలో చోటుచేసుకుంది. న్యూఢిల్లీలోని ఇంద్రపురి ప్రాంతంలో 11 ఏళ్ల బాలుడి హత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రియుడు కుమారుడిని ప్రియురాలు హత్య చేసింది. అనంతరం నీ నుంచి అత్యంత విలువైన వస్తువును లాక్కున్నాను అంటూ ప్రియుడికే ఫోన్ చేసి చెప్పింది.
ఢిల్లీకి చెందిన పూజా కుమారికి 2019లో జితేందర్ అనే వ్యక్తితో పరిచయమైంది. అప్పటికే అతనికి భార్య, కుమారుడు ఉన్నారు. భార్యకు విడాకులిచ్చి పెళ్లి చేసుకుంటానని జితేందర్ పూజను నమ్మించి కొద్ది రోజులు సహజీవనం చేశాడు. కొద్ది రోజుల తర్వాత ఆమెను దూరం పెడుతూ వచ్చాడు. తనను పెళ్లి చేసకోవాలంటూ పూజ జితేందర్ పై ఒత్తిడి పెంచింది. అప్పటికే కుమారుడు ఉండడంతో భార్యకు విడాకులు ఇవ్వడం సాధ్యపడలేదు. ఎలాగైనా కొడుకును చంపితే భార్యకు విడాకులు ఇచ్చి తనను పెళ్లి చేసుకుంటాడని యువతి భావించింది.
ఈ నెల 10న పూజా జితేందర్ ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో ఇంట్లో జితేందర్ కుమారుడు ఒక్కడే ఉన్నాడు. అప్పటికే అతడు నిద్రపోతున్నాడు. ఇదే అదును అని భావించిన పూజ బాలుడి గొంతు నులిమి చంపింది. అనంతరం దుస్తుల్లో శవాన్ని చుట్టేసి వెళ్లిపోయింది. ఇంటికి వచ్చిన జితేందర్ కుమారుడి మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా నిందితురాలని పోలీసులు గుర్తించారు.
తనను దూరం పెడుతున్న ప్రియుడికి గుణపాఠం చెప్పాలని భావించిన పూజ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. బాలుడిని చంపిన అనంతరం పూజా జితేంద్రకు ఫోన్ చేసి నీ నుంచి విలువైన వస్తువును లాక్కున్నానని చెప్పడం ఆమె మానసిక ఉన్మాదానికి పరాకాష్టగా నిలుస్తున్నది.