కొత్త సచివాలయం చిన్నపాటి వర్షానికే ఉరుస్తోంది. తెలంగాణ సర్కార్ ఛాలెంజ్గా తీసుకొని నిర్మించిన సెక్రెటెరియట్ కొద్ది పాటి వానకే కురుస్తోంది. ఆదివారం పడిన వర్షం సచివాలయ నిర్మాణ లోపాలను బయట పెట్టింది. సోమవారం నూతన సెక్రెటెరియట్లోకి మీడియా ప్రతినిధులు వెళ్లారు. ఈ సందర్భంగా మీడియా సెంటర్ వద్దకు చేసుకున్న వారికి విస్తుపోయే దృశ్యాలు కనిపించాయి. కొత్త సచివాలయంలోని మీడియా సెంటర్లోకి పిల్లర్ల ద్వారా వచ్చిన నీరు చేరింది. పిల్లర్లకు సన్నని పగుళ్లు రావడంతో.. వాటర్ ఆ పగుళ్ల నుంచి మీడియా సెంటర్లో వచ్చింది.
మూడు రోజుల క్రితం కురిసిన వర్షానికి కూడా పై ఫోర్ సీలింగ్ నుంచి బొట్లు బొట్లుగా వర్షపు చుక్కలు కింద పడ్డాయి. పై ఫ్లోర్ లోని కొంత భాగానికి చెమ్మ పట్టింది. ఇక ఇది మరవక ముందే ఆదివారం మరోసారి మీడియా సెంటర్లోకి పిల్లర్ల ద్వారా వర్షపు నీరు రావడం సచివాలయ ప్రాంగణంలో చర్చనీయాంశంగా మారింది. ఇదేం నిర్మాణమంటూ పలువురు చర్చించుకున్నారు. ఇలా అయితే కొత్త సచివాలయంలోకి రావడమేలా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.
ఇక కొద్దిపాటి వర్షానికే పరిస్థితి ఇలా ఉంటే భారీ వర్షాలు కురుస్తే సిచ్యుయేషన్ ఏంటని అడుగుతున్నారు. చిన్నపాటి వర్షానికి మీడియా సెంటర్లోకి నీళ్లు వస్తే రేపు పొద్దున అది పటిష్టంగా ఉంటుందని ఎలా నమ్మగలమని పలువురు కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పాలన మొన్నటి వరకు బీఆర్కే భవన్ నుంచి కొనసాగేది. అప్పుడు అందులోకి మీడియాకు ప్రవేశం ఉండేది కాదు.
బీఆర్కే భవన్లో ఇరుకిరుకు గదులు ఉండడం వల్ల మీడియా కూడా ఆ వైపు వెళ్లేందుకు ఇబ్బందిగా ఫీలయ్యేది. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం విశాలమైన ప్రాంగణంలో నూతన సచివాలయాన్ని నిర్మించింది. అయితే అన్ని హంగులతో కొత్త సెక్రెటెరియట్ను కట్టినట్లు సర్కార్ చెప్పింది. ఇక ప్రభుత్వం అంతా బాగానే ఉన్నట్లు చెబుతున్నప్పటికీ..ప్రస్తుతం పలుచోట్ల చిన్నపాటి వర్షానికి శ్లాబ్ల నుంచి నీరు కారుతుండడం,ఫిల్లర్ల నుంచి వర్షపు నీరు లీక్ అవుతుండడంతో సర్కార్పై విమర్శలు వెల్లువెత్తున్నాయి.