Amaravati Movement : అమరావతి ఉద్యమం 1600వ రోజుకు చేరుకున్న సందర్భంగా శనివారం రాజధాని గ్రామాల్లో రైతులు ప్రత్యేక నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. మందడంలో గ్రామ దేవత పోలేరమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడారు.
రాష్ట్రంలో వైసీపీ పాలన అంతం కావాలని, ఆంధ్రుల స్వర్ణాంధ్ర కల సాకారమవ్వాలని ఆకాంక్షించారు. గత ఐదేళ్లలో అమరావతితో పాటు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగువారి ఆత్మగౌరవం నిలిచేలా టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతికి శ్రీకారం చుడితే , ఆయనపై పగతో జగన్ విధ్వంసం సృష్టించారని రైతులు మండిపడ్డారు.
17 డిసెంబర్ 2019న అసెంబ్లీలో ఏపీ సీఎం జగన్ మూడు రాజధానుల ఆటకు తెరతీశాక అమరావతి ఉద్యమం ప్రారంభమైంది. ప్రతిపక్ష నేతగా అమరావతిని ఆహ్వానించిన జగన్, అధికారంలోకి వచ్చాక మాటతప్పారు. ప్రస్తుతం అమరావతి ఉద్యమం 1600వ రోజుకు చేరింది.