AP Anganwadi Workers : ప్రభుత్వ తాటాకు చప్పుళ్ళకు తాము భయప డమని అంగన్వాడీ కార్యకర్తలు అంటున్నారు. ఏస్మా ప్రయోగించినా వెనక్కి తగ్గేది లేదని మా సమ్మెను మరింత ఉధృతం చేస్తామని అంగన్వాడీ కార్యకర్తలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల తర్వాత మా వేతనాలు పెంచకుండా మోసం చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
న్యాయమైన డిమాండ్ల కోసం మేము గత నెల రోజులుగా ఆందోళన చేస్తున్న ప్రభుత్వానికి కనికరం కూడా లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇచ్చిన హామీని అమలు చేయమని అడిగితే మాపై ఎస్మా ప్రయోగించడం ఏంటని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మండివైఖరిని ప్రదర్శిస్తే తాము కూడా అదేవిధంగా ఉంటామని మా న్యాయమైన డిమాండ్ల కోసం ఎందాకైనా వెళ్దామని అంగన్వాడీలు హెచ్చరిస్తున్నారు.