30 C
India
Wednesday, May 15, 2024
More

    AP CM Jagan : జగన్ విశాఖకు షిఫ్ట్.. మరి ఆ రెండు జిల్లాలు వైసీపీ వదులుకున్నట్లేనా..?

    Date:

    AP CM YS Jagan Mohan Reddy says that the administration will start at Visakhapatnam from Dussehra onwards
    AP CM YS Jagan Mohan Reddy says that the administration will start at Visakhapatnam from Dussehra onwards

    AP CM Jagan :

    ఏపీ పరిపాలనా రాజధానిగా విశాఖను సీఎం జగన్ గతంలోనే ప్రకటించారు. ఇక అక్కడి నుంచే పాలన కొనసాగుతుందని చెబుతూ వస్తున్నారు. ఇక విశాఖ కు షిఫ్ట్ అవుతానని రేపు, మాపు అంటూ వాయిదా వేస్తూ వస్తున్నారు. తాజాగా దసరా నుంచి విశాఖలోనే ఉంటానని, అక్కడి నుంచే పాలన కొనసాగుతుందని ప్రకటించారు.ఈ దిశగా ఇప్పటికే మంత్రివర్గానికి, అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక దసరా పండుగ నుంచి ఏపీ ప్రభుత్వం వైజాగ్ నుంచే తన పూర్తి కార్యకలాపాలను కొనసాగించనుంది.

    అయితే ఇక్కడి వరకు బాగానే గత ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించగానే హైదరాబాద్లోని ఏపీ ఉద్యోగులంతా విజయవాడకు తరలివచ్చారు. విజయవాడతో పాటు సమీప ప్రాంతాల్లో స్థలాలు కొనుగోలు చేసుకున్నారు. కొందరు అద్దె ఇండ్లలో ఉంటున్నారు. మరికొందరు ఏకంగా ఇండ్లు కట్టుకున్నారు. తద్వారా గుంటూరు, కృష్ణ జిల్లాల్లో ఉద్యోగుల రాకతో సందడి పెరిగింది. ఇక్కడే రాజధాని నిర్మాణం జరుగుతుందని అంతా ఆశించారు.

    అయితే ఇప్పుడు వైసీపీ అధికారంలో కి  వచ్చాక వైసీపీ మాట మార్చింది. ఇప్పటికే నగరంగా ఉన్న విశాఖను రాజధానిగా చేస్తే, వసతులు త్వరగా సమకూరుతాయని అభిప్రాయపడింది. అయితే దీనిని కొన్ని వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. ప్రభుత్వం మూడు రాజధానులంటూ తెరపైకి తెచ్చినా మెజార్టీ ప్రజలు అమరావతి వైపే మొగ్గు చూపుతున్నారు. కొత్తగా నిర్మించుకునే నగరాన్ని రాజధానికి అనువుగా మార్చుకోవచ్చనే అభిప్రాయంలో చాలా మంది ఉన్నారు. అయితే ఇప్పుడు ఉద్యోగులు విశాఖకు తరలివెళ్తే, ఈ రెండు జిల్లాల్లో కొంత రద్దీ తక్కువయ్యే  అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇక ఈ రెండు జిల్లాలు ఇక వైసీపీకి, సీఎం జగన్ కు దూరమైనట్లేనని భావించవచ్చు. ఇప్పటికే వైసీపీ ప్రభుత్వ తీరుతో ఈ రెండు జిల్లాల్లో వైసీపీ అంటేనే మండిపడే పరిస్థితి ఉంది. ఇక విశాఖకు రాజధాని తరలిస్తే మరింత కష్టం వైసీపీ కొనితెచ్చుకున్నట్లే అవుతుందనే అభిప్రాయం వినిపిస్తున్నది.

    Share post:

    More like this
    Related

    NRI News : సూర్యపేట- ఖమ్మం హైవేపై మిస్ అయిన అమెరికా నుంచి వచ్చిన ప్రవాసుల బ్యాగులు

    NRI News : అమెరికా నుంచి వచ్చిన ప్రవాస భారతీయుల బ్యాగులు మిస్...

    Rashmika : సీ లింక్ బ్రిడ్జి ‘అటల్ సేతు’పై రష్మిక కామెంట్.. ఏమందంటే?

    Rashmika :జనవరిలో ప్రధాన మంత్రి మోదీ భారతదేశపు అతి పెద్ద సీ...

    Jagan : జగన్ సైలెంట్ మోడ్ లోకి ఎందుకు వెళ్లినట్లు..?

    Jagan Silence : ఆంధ్రప్రదేశ్ లో నిన్న (మే 13) పోలింగ్...

    Dhanush-Aishwarya : ధనుష్, ఐశ్వర్య మధ్య అంతరాలకు కారణం అదేనా?

    Dhanush-Aishwarya : జనవరి 17, 2022, నటుడు ధనుష్ 18 సంవత్సరాల...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Jagan : అనుకున్నది ఒకటి.. అయ్యింది మరొకటి..!

    Jagan : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి...

    CM Jagan : సిఎం జగన్ పై దాడి కేసులో అప్ డేట్

    - నిందితులను కోర్టులో ప్రవేశపెట్టనున్న పోలీసులు CM Jagan : సిఎం జగన్...

    Police Statement : జగన్ పై దాడి కేసు.. పోలీసుల ప్రకటన

    Police Statement : సిఎం జగన్ పై రాయితో దాడి చేసిన...

    CM Jagan : సీఎం జగన్ వస్తున్నారంటే.. చెట్లపై వేటు

    CM Jagan Tour : సీఎం జగన్ పర్యటిస్తున్నారంటే చాలు.. ఆయన...