![Narendra Modi](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/06/P-7-24.jpg)
Narendra Modi : మోదీ ప్రమాణ స్వీకారానికి అతారథ మహారథులు వస్తున్నారు. ఢిల్లీకి వివిధ దేశాల ప్రధానులు చేరుకుంటున్నారు. ఇప్పటికే ఢిల్లీకి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా చేరుకోగా, శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే, మాల్దీవుల అధ్యక్షుడు డా. మొహమ్మద్ ముయిజ్జు, సీషెల్స్ వైస్ ప్రెసిడెంట్ అహ్మద్ అఫీఫ్, మారిషస్ ప్రధాని ప్రవింద్ కుమార్ జుగ్నాథ్, నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్, భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గే ఢిల్లీకి రాబోతున్నారు.
ఈరోజు రాత్రి 7.15 గంటలకు మోదీ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు బీజేపీతో సహా ఎన్డీయే పక్షాల నుంచి దాదాపు 30 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. హోం, డిఫెన్స్, ఫైనాన్స్, విదేశాంగ మంత్రులుా బీజేపీ నేతలే ఉంటారని సమాచారం. మొత్తం కేంద్ర కేబినెట్ 78 నుంచి 81 మందితో కొలువుదీరనున్నట్లు తెలుస్తోంది.