Ready : మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రావు పంచాయతీ ఇప్పట్లో తెలేటట్లు లేదు. ఆయన అసంతృప్తి చల్లారే విధంగా కనిపించడం లేదు. ఇప్పడు ఆయన ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు మరోసారి రాజకీయ చర్చకు తెర లేపాయి. వేసవి కాలం నేపథ్యంలో నగరపాలక సంస్థ కార్యాలయం, ప్రకాశం చలివేంద్రాలు చేసేందుకు ఏర్పాటు చేశారు.అయితే ఎమ్మెల్యే బాలినేనితో ప్రారంభింపజేయాలని నిర్ణయించారు. అయితే వివిధ కారణాల వల్ల ఈ కార్యక్రమం వాయిదా పడింది. చలివేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన ప్లెక్సీల్లో ముఖ్యమంత్రి జగన్, పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఫోటోలు లేకపోవడం కొత్త చర్చకు తీసింది.
గత కొద్ది రోజులు అసంతృప్తితో రగిలిపోతున్నాడు.గత నెల 29న వైసిపి రీజనల్ కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేసిన ఆయన ఆ తర్వాత సీఎం జగన్ స్వయంగా తన కార్యాలయానికి పిలిపించి బుజ్జగించినా బాలినేని తన పంతాన్ని వీడలేదు. పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని, ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పట్టించుకోవడం లేదని జగన్ ముందు తన ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ అవన్నీ నేను చూసుకుంటానని, రాజీనామాను వెనక్కి తీసుకోవాలని కోరగా సున్నితంగా తిరస్కరించి సమావేశం నుంచి బయటకు వెళ్లి పోయారు.
అయితే ఒంగోలు డీఎస్పీ మార్పుపై కూడా ఆయన అలకకు కారణంగా చెబుతున్నారు. ఆయన అనుచరులు. అయితే తాను కోరిన వ్యక్తిని ఒంగోలు డీఎస్పీ గా నియమిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఇన్ని జరిగినా ఆయన అసంతృప్తి తగ్గలేదని ఈ ప్లెక్సీల వ్యవహరం అర్థమవుతుంది.
ప్రకాశం జిల్లాలో బాలినేని పార్టీ మారుతున్నారని అందుకే జగన్ ఫోటో లేకుండా ప్లెక్సీలు ఏర్పాటు చేశారని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఆయన అడుగులు జనసేన వైపు పడుతున్నాయని, ఇటీవల జనసేన నేతలు ఆయనను కలిశారు అని గుసగుసలు వినిపిస్తున్నాయి.