Bigg Boss 7 Nominations : బిగ్ బాస్ సీజన్ 7 రసవత్తరంగా సాగుతుంది. అప్పుడే 9 వారాలు పూర్తి అయ్యి 10వ వారంలోకి కూడా అడుగు పెట్టింది. ఇక 9వ వారం తేజ బయటకు రావడంతో ఇప్పుడు హౌస్ లో 11 మంది మాత్రమే ఉన్నారు. ప్రస్తుతం సోమవారం నుండే నామినేషన్స్ షురూ అయ్యాయి. రాజమాత – ప్రజా అనే కాన్సెప్ట్ ను బిగ్ బాస్ తీసుకు వచ్చారు.
హౌస్ లో అమ్మాయిలను బిగ్ బాస్ రాజమాతలుగా ప్రకటించాడు. అశ్విని, రతిక, శోభా, ప్రియాంక నలుగురు లేడీ కంటెస్టెంట్స్ రాజమాతలుగా ఉంటారు.. మేల్ కంటెస్టెంట్స్ మధ్య నామినేషన్స్ ఉంటాయి.. ప్రతీ ఒక్కరు ఇద్దరు పేర్లు చెప్పగా వారిలో ఒకరిని రాజమాతలుగా ఉన్న నలుగురు డిసైడ్ చేస్తారు. ఈ ఎపిసోడ్ ఆసక్తిగా సాగుతుంది.
ముందుగా నామినేషన్స్ లో అమర్ దీప్, అర్జున్ వచ్చారు. అమర్ దీప్ ఎప్పటిలాగానే భోలేను టార్గెట్ చేసాడు. దీంతో భోలే, అమర్ మధ్య వాగ్వివాదం జరిగింది. ఇక అర్జున్ గౌతమ్ ను నామినేట్ చేసాడు.. ఈ ఇద్దరిలో భోలేను రాజమాతలు నామినేట్ చేసారు. ఆ తర్వాత యావర్, ప్రశాంత్ పాల్గొనగా వీరిలో యావర్ అమర్ దీప్ ను నామినేట్ చేసారు..
ప్రశాంత్ వచ్చి గౌతమ్ ను నామినేట్ చేసాడు.. భోలే అమర్ దీప్ ను నామినేట్ చేసాడు.. ఈ సమయంలో అశ్విని మాట్లాడబోతుంటే ప్రియాంక సీరియస్ అయ్యింది. ఈ సమయంలో అశ్విని మీద ప్రియాంక, శోభా శెట్టి డామినేషన్ కనిపించింది.. అశ్విని కన్నీళ్లు పెట్టుకుంది..
ఇక ఆ తర్వాత శివాజీ వచ్చి అమర్ దీప్ ను నామినేట్ చేసాడు. యావర్ కూడా అమర్ దీప్ ను నామినేట్ చేయాలని అనుకోగా ఒక కంటెస్టెంట్ ను ఒకసారి మాత్రమే నామినేట్ చేయాలని బిగ్ బాస్ చెప్పడంతో తనని తానే నామినేట్ చేసుకున్నాడు. వీరిలో యావర్ ను నామినేట్ చేయాలని రాజమాతలు డిసైడ్ అయ్యారు.
చివరిగా నలుగురు రాజమాతల్లో ఒకరిని నామినేట్ చేయమని బిగ్ బాస్ చెప్పగా రతిక, అశ్విని కలిసి ప్రియాంకను నామినేట్ చేసారు.. రతిక, శోభా పేర్లు టై అవ్వడంతో కెప్టెన్ గా శోభా రతికను నామినేట్ చేసింది. మొత్తానికి నామినేషన్స్ లో భోలే, గౌతమ్, శివాజీ, యావర్, రతిక ఉన్నారు.